తెలంగాణకు హరితహారం అద్భుతం: యూపీ మంత్రి అరుణ్ కుమార్

పచ్చదనం గొప్పగా పెంచారు.తెలంగాణలో అడవుల పునరుద్ధరణ.ప్రతీ గ్రామంలో నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు బాగున్నాయి.ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్. విధాత, హైదరాబాద్ : హరితహారం లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో చెట్ల పెంపకం అద్భుతం గా జరుగుతుందని తెలంగాణలో పర్యటిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బృందం ప్రతినిధులు తెలిపారు. తెలంగాణకు హరితహారం పనులను పరిశీలించడంతో పాటు వివిధ జిల్లాల్లో పర్యటించి హరితహారం ఫలాలను స్వయంగా పరిశీలించారు. ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ నేతృతంలోని […]

తెలంగాణకు హరితహారం అద్భుతం: యూపీ మంత్రి అరుణ్ కుమార్

పచ్చదనం గొప్పగా పెంచారు.
తెలంగాణలో అడవుల పునరుద్ధరణ.
ప్రతీ గ్రామంలో నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు బాగున్నాయి.
ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్.

విధాత, హైదరాబాద్ : హరితహారం లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో చెట్ల పెంపకం అద్భుతం గా జరుగుతుందని తెలంగాణలో పర్యటిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బృందం ప్రతినిధులు తెలిపారు. తెలంగాణకు హరితహారం పనులను పరిశీలించడంతో పాటు వివిధ జిల్లాల్లో పర్యటించి హరితహారం ఫలాలను స్వయంగా పరిశీలించారు.

ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ నేతృతంలోని బృందం మేడ్చల్ మల్కాజ్ గిరి, సిద్దిపేట జిల్లాల్లో పర్యటించారు. అటవీ పునరుద్ధరణ, పల్లె ప్రకృతి వనాలు, అర్బన్ ఫారెస్ట్ పార్క్ (కండ్లకోయ ఆక్సీజన్ పార్క్), ఔటర్ రింగ్ రోడ్ లో పచ్చదనం యూపీ బృందం పరిశీలించింది.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్, జప్తి సింగాయి పల్లి నర్సరీ, ములుగు నర్సరీ, పల్లె ప్రకృతి వనాలను, యూపీ మంత్రి బృందం FCRI ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్సిట్యూట్, ములుగును సందర్శించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ఫారెస్ట్ మినిస్టర్ అరుణ్ కుమార్, తెలంగాణ అటవీ శాఖ అధికారులు, పీసీసీఎఫ్ ఆర్. ఎం. డోబ్రియాల్, సలహాదారు ఆర్. శోభలతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అడవుల పెంపుదల, నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు చాలా బాగున్నాయని అన్నారు. పచ్చదనం పెంపుదలలో పంచాయతీ, ప్రజలు భాగస్వామ్యమయ్యారని పేర్కొన్నారు. అందుకే ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తోందనీ అన్నారు.

అర్బన్ ఫారెస్ట్ పార్కులు, పల్లె ప్రకృతి వనాల అభివృద్ధి చాలా ప్రశంసనీయమని అన్నారు. ఈ పర్యటనలో అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపుదలపై చాలా విషయాలు గ్రహించినట్లు అరుణ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ కన్జర్వేటర్ ఆశ, డీఎఫ్ఓ శ్రీధర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.