విధాత, నల్గొండ: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను పార్టీ అధిష్టానం ఎంపిక చేయడం పట్ల పాల్వాయి స్రవంతి స్పందించారు. పార్టీ టికెట్ రావడం బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. టికెట్ కోసం పలువురు పోటీపడినా.. నేను సరైన అభ్యర్థిని అని కాంగ్రెస్ పార్టీ భావించిందన్నారు. టికెట్ ఎవరికి ఇచ్చిన కలిసి పని చేయాలని ముందే అనుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీని అసలైన కార్యకర్తలు ఎవరు వీడలేదని అన్నారు. నాయకులు పోయినంత మాత్రాన పార్టీకి నష్టమేమీ […]
విధాత, నల్గొండ: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను పార్టీ అధిష్టానం ఎంపిక చేయడం పట్ల పాల్వాయి స్రవంతి స్పందించారు. పార్టీ టికెట్ రావడం బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు.
టికెట్ కోసం పలువురు పోటీపడినా.. నేను సరైన అభ్యర్థిని అని కాంగ్రెస్ పార్టీ భావించిందన్నారు. టికెట్ ఎవరికి ఇచ్చిన కలిసి పని చేయాలని ముందే అనుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీని అసలైన కార్యకర్తలు ఎవరు వీడలేదని అన్నారు. నాయకులు పోయినంత మాత్రాన పార్టీకి నష్టమేమీ లేదన్నారు.
ఉప ఎన్నికల్లో మునుగోడు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పట్ల నియోజకవర్గం ప్రజల్లో ఉన్న అభిమానం, అధికార టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలు, బీజేపీ అవకాశవాద రాజకీయాలు ఉప ఎన్నికల్లో తన గెలుపుకు దోహదం చేస్తాయన్నారు.