వేరొకరితో భర్త వివాహేతర సంబంధం.. భార్య బలవన్మరణం
ఉరేసుకుని ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం తిరుపతిలో చోటుచేసుకుంది. ఐతే తన అల్లుడు, ఆయన తండ్రి, అల్లుడితో వివాహేతర సంబంధం కలిగిన మరో మహిళ కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి, బంధువులు ఆరోపిస్తు న్నారు. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్ వెల్లడించిన వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా వెంకటగిరి దొమ్మరపాళ్యంకు చెందిన సాలపక్ష రాజయ్య, పోలమ్మ దంపతుల కుమార్తె చంద్రకళ (35)కు, కడప జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన […]

ఉరేసుకుని ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం తిరుపతిలో చోటుచేసుకుంది. ఐతే తన అల్లుడు, ఆయన తండ్రి, అల్లుడితో వివాహేతర సంబంధం కలిగిన మరో మహిళ కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి, బంధువులు ఆరోపిస్తు న్నారు. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్ వెల్లడించిన వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా వెంకటగిరి దొమ్మరపాళ్యంకు చెందిన సాలపక్ష రాజయ్య, పోలమ్మ దంపతుల కుమార్తె చంద్రకళ (35)కు, కడప జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన మన్నెపూల వనస్వామి కుమారుడు నాగరాజుతో 16 సంవత్సరాల క్రితం వివాహం చేశారు.
వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నాగరాజు కొయ్యబొమ్మలు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తిరుపతికి వచ్చిన నాగరాజు ఎస్ఎల్వీ నగర్లో కుటుంబంతో కాపురం ఉంటున్నాడు. ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన మునికుమారమ్మ అనే మహిళతో వివాహేత సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఎస్ఎల్వీ నగర్లోనే కాపురం పెట్టాడు. ఈ విషయం తెలిసిన చంద్రకళ భర్తను నిలదీసింది. దీంతో నాగరాజు ప్రతీరోజూ భార్యను హింసించేవాడు.