YS Sharmila| ఉపాధి పథకం పేరుమార్పు దేశ ద్రోహమే : వైఎస్.షర్మిల

మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును "రామ్ - జి" (రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్) పేరుగా మార్చాలనుకోవడం దేశ ద్రోహపు చర్యగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల విమర్శించారు. ఉపాధి హామీ పథకం పేరును మార్చడం ద్వారా ప్రధాని మోదీ, బీజేపీ-ఎన్డీఏ కూటమి జాతిపిత గాంధీని అవమానించడమేనని మండిపడ్డారు.

YS Sharmila| ఉపాధి పథకం పేరుమార్పు దేశ ద్రోహమే : వైఎస్.షర్మిల

అమరావతి : మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(MGNREGA) పేరును “రామ్ – జి” (రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్) పేరుగా మార్చాలనుకోవడం దేశ ద్రోహపు చర్యగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(YS Sharmila) విమర్శించారు. ఉపాధి హామీ పథకం పేరును మార్చడం ద్వారా ప్రధాని మోదీ, బీజేపీ-ఎన్డీఏ కూటమి జాతిపిత గాంధీని అవమానించడమేనని మండిపడ్డారు. ప్రధాని మోదీరు అభినవ గాడ్సేగా మారిడాని, ఆయన నాథూరామ్ కి వారసుడు అని షర్మిల ఎక్స్ వేదికగా విమర్శించారు.

అనాడు గాడ్సే మహాత్మను భౌతికంగా హత్య చేస్తే, నేడు బాపుజీ పేరు తొలగించి గాంధీజీ ఆశయాలను, స్వాతంత్ర్యపు లక్ష్యాలను, గాంధీ నేర్పిన సిద్ధాంతాలను తుడిచిపెట్టి మోదీ మరో హత్య చేస్తున్నారని ఆరోపించారు. నరేగా పథకాన్ని ఆర్ఎస్ఎస్ స్కీమ్ గా మార్పు చేస్తున్నారన్నారు.

మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ(MGNREGA) పథకానికి ఉన్నఫళంగా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది ? అని షర్మిల కేంద్రాన్ని ప్రశ్నించారు. 100 రోజుల పని దినాల నుంచి 125 రోజుల పెంపుకు గాంధీజీ పేరు మారుస్తారా ? మహాత్మా పేరు చెరిపేస్తే ఖర్చు తప్పా.. మోదీకి దక్కే లాభం ఏంటి ? స్వాతంత్ర్య సమరయోధుల మీద, ఈ దేశ మాజీ ప్రధానుల మీద బీజేపీకి ఎందుకంత కోపం ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేగా పథకానికి పూజ్య బాపూజీ పేరు మార్చాలని చూసే కేంద్రం ప్రయత్నాలను తిప్పికొట్టాలని, దేశం మొత్తం మోదీ తీరును ప్రతిఘటించాలని, ఃరాష్ట్ర ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించాలని షర్మిల కోరారు.