ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీ-జనసేన కూటమి ప్రజాగళం ఉమ్మడి మ్యానిఫెస్టో(2024)ను మంగళవారం టీడీపీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్లు విడుదల చేశారు
విధాత, హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీ-జనసేన కూటమి ప్రజాగళం ఉమ్మడి మ్యానిఫెస్టో(2024)ను మంగళవారం టీడీపీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్లు విడుదల చేశారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇంచార్జి సిద్ధార్థనాథ్సింగ్ తో కలిసి మ్యానిఫెస్టో విడుదల చేశారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన షణ్ముఖ హామీలను కలబోతగా ప్రజాగళం ఉమ్మడి మ్యానిఫెస్టోను రూపొందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే మూడు పార్టీలు కూటమిగా జట్టు కట్టామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి పూర్వవైభవం తేవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం సూపర్ సిక్స్ పధకాలతో ముందుకొచ్చినట్లు చెప్పారు. మ్యానిఫెస్టో అమలుకు కేంద్రం సహకారం దండిగా ఉంటుందన్న ఆశాభావాన్ని వారు ప్రకటించారు. జాతీయ పార్టీయైన బీజేపీకి జాతీయ మ్యానిఫెస్టో ఉంటుందని, ఈ మ్యానిఫెస్టో కేవలం టీడీపీ-జనసేనలది మాత్రమేననిబాబు స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఏపీ ప్రజల రేపటి ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మ్యానిఫెస్టోను రూపొందించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచారని, ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారని, వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని, లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తులు కబ్జా చేశారని, స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన రూ.12 వేల కోట్లు మళ్లించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, విధ్వంస పాలనను సాగనంపేందుకు కూటమి ముందుకొచ్చిందని పవన్ తెలిపారు.
మ్యానిఫెస్టో ముఖ్యాంశాలు
టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రధానంగా వృద్దుల పింఛన్ పథకం వైసీపీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన 3500లకు అదనంగా 500పెంచి 4వేలుగా ప్రకటించడం, అలాగే వికలాంగులకు 6వేలు, పూర్తి వికలాంగులకు 10వేల పింఛన్ ప్రకటించడటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రైతులకు ఏటా 20వేల సహాయం, స్కూలుకెళ్లే విద్యార్థికి ఏటా 15వేలు, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకూ ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేత, ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల బీమా సదుపాయం, డిజిటిల్ హెల్త్కార్డులు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం.. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి, యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిసామని కీలక హామీలిచ్చారు. ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15 వేల చొప్పున ఆర్ధిక సాయం, రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం, ఆక్వారైతులకు రూ.1,50కే యూనిట్ విద్యుత్, పట్టణ ప్రాంతాల్లో పేదలకు రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి జాగా, ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు కట్టించడం, ఇసుక ఉచితం, రాజధానిగా అమరావతి కొనసాగింపు, భూ హక్కు చట్టం రద్దు, సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20వేల సాయం వారికి వ్యతిరేకంగా తెచ్చిన 217 జీవో రద్దు, బోట్ల మరమ్మతులకు ఆర్ధిక సాయం, చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, వృద్ధాప్య పింఛను నెలకు రూ. 4వేలు, పెంచిన పింఛను ఏప్రిల్-2024 నుంచి అమలు, దివ్యాంగులకు రూ. 6వేల పింఛన్, బీసీలకు 50 ఏళ్లకు నెలకు రూ.4వేల పింఛన్, ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలకు రూ. 10లక్షల రాయితీ, ఎన్డీయే తెచ్చిన 10శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు, చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు, బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు ఖర్చు, ఉద్యోగుల సీపీఎస్ సమీక్షించి సరైన పరిష్కార మార్గం ప్రతిపాదన, ఔట్సోర్సింగ్, అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయంపై హామీ, వాలంటీర్లకు రూ.10వేల గౌరవ వేతనం, కాపు సంక్షేమం కోసం రూ. 15వేల కోట్లు ఖర్చు, ఆదరణ పథకం కింద ఏటా రూ. 5వేల కోట్లతో పరికరాల పంపిణీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం, దోబీ మాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ. 25 వేల గౌరవ వేతనం, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్లు, ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ. 25 వేల గౌరవ వేతనం, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్లు, వడ్డెరలకు క్వారీల్లో 15శాతం రిజర్వేషన్లు, రాయల్టీ, సీనరేజీల్లో మినహాయింపు, స్వర్ణకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్, ఇబ్బందుల్లో ఉన్న చేనేత, మరమగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మెగా డీఎస్సీపై తొలి సంతకం, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల, పరిశ్రమలకు అనుగుణంగా విధానాలు, అందరికీ అందుబాటులో డిజిటల్ లైబ్రరీలు, క్రీడలకు ప్రోత్సాహం, ప్రతి మండలంలో జనరిక్ మందుల దుకాణాలు, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, పండుగ కానుకలపై హామీ, ఈడబ్ల్యూఎస్ నుంచి కాపులకు దామాషా పద్ధతిన రిజర్వేషన్లను, పీఆర్సీ ప్రకటన, అప్పటిలోగా ఇంటెరిమ్ రిలీప్ అందచేత, ఆడపిల్లల విద్యకోసం ‘కలలకు రెక్కలు పథకం’ ప్రారంభం, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా, విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణం, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10వేల గౌరవ భృతిని మ్యానిఫెస్టోలో ప్రకటించారు.