ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలకు చెందిన 13 మంది జర్నలిస్టులు కోవిడ్ భారిన పడి మరణించినట్లు వచ్చిన వార్త పట్ల బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు,ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఈ ఉదయం స్పందిస్తూ ఇది చాలా దురదృష్టకరం అని పేర్కొన్నట్లు అల్ ఇండియా న్యూస్పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ సీనియర్ ఉపా అధ్యక్షులు చలాది పూర్ణచంద్ర రావు తెలిపారు.ఇప్పటికే కేంద్రప్రభుత్వం కోవిడ్ తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష నుండి 5 లక్షలవరకు ఆర్ధిక సహాయం […]
ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలకు చెందిన 13 మంది జర్నలిస్టులు కోవిడ్ భారిన పడి మరణించినట్లు వచ్చిన వార్త పట్ల బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు,ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఈ ఉదయం స్పందిస్తూ ఇది చాలా దురదృష్టకరం అని పేర్కొన్నట్లు అల్ ఇండియా న్యూస్పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ సీనియర్ ఉపా అధ్యక్షులు చలాది పూర్ణచంద్ర రావు తెలిపారు.ఇప్పటికే కేంద్రప్రభుత్వం కోవిడ్ తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష నుండి 5 లక్షలవరకు ఆర్ధిక సహాయం అందించేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు.ఇలా ఉండగా శనివారం మధ్యాహ్నం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఈదా రాంబాబు ఆనే మరో సీనియర్ పాత్రికేయుడు మరణించడంతో కోవిడ్ తో ఈ వారంలో మరణించిన జర్నలిస్టుల సంఖ్య 14 కి చేరిందని పూర్ణచంద్ర రావు తెలిపారు.కోవిడ్ కి గురైన జర్నలిస్టులు రెమిడేసివిర్ ఇంజక్షన్లను 30 వేలకు కొనుగోలు చేసేందుకు ఆర్ధికంగా వారు పడుతున్న కష్టాలను తెలుసుకున్న వెంటనే స్పందించిన ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.నెల్లూరు జిల్లా జర్నలిస్టుల కోసం 225 రెమిడెసివిర్ ఇంజక్షన్లు మానవతా దృక్పథంతో ఉచితంగా అందజేస్తున్నందుకు.రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి పూర్ణచంద్ర రావు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఫర్ ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా (ఏపీజేయూ)రాష్ట్ర అధ్యక్షులు జాలే వాసుదేవ నాయుడు కూడా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి రాష్ట్ర జర్నలిస్టుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ నెల్లూరులో ఒక ప్రకటన లో పేర్కొన్నారు.జర్నలిస్టుల మృతి పట్ల బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు విచారం.