విధాత: డిగ్రీ అధ్యాపకుల సాధారణ బదిలీలకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు రెండేళ్ల సర్వీసు పూర్తయిన అధ్యాపకులను అర్హులుగా గుర్తిస్తూ బదిలీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఐదేళ్ల సర్వీసు ఒకేచోట ఉన్నవారికి తప్పని సరిగా బదిలీ చేయాలని ఆదేశించారు. 2023 జూన్ 30 లోపు పదవీ విరమణ చేసేవారికి మినహాయింపు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. బదిలీలకు అవకాశం కల్పించడంపై సీఎంకు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపింది.
విధాత: డిగ్రీ అధ్యాపకుల సాధారణ బదిలీలకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు రెండేళ్ల సర్వీసు పూర్తయిన అధ్యాపకులను అర్హులుగా గుర్తిస్తూ బదిలీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఐదేళ్ల సర్వీసు ఒకేచోట ఉన్నవారికి తప్పని సరిగా బదిలీ చేయాలని ఆదేశించారు. 2023 జూన్ 30 లోపు పదవీ విరమణ చేసేవారికి మినహాయింపు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. బదిలీలకు అవకాశం కల్పించడంపై సీఎంకు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపింది.