విధాత: కోవిడ్ మృతుల దహన సంస్కారాలకు నయాపైసా కూడా తీసుకోవద్దని వైస్సార్ కాంగ్రెస్ రాజమండ్రి-సిటీ కో ఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ సూచించారు. సోమవారం ఆయన రాజమండ్రి కైలాసాభూమిలో మృతుల దహన సంస్కారాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైలాస భూమి వ్యాపార వ్యవస్థగా తయారవ్వడం దారుణమన్నారు. కోవిడ్ మృతుల దహన సంస్కారాలకు వేలకువేలు వసూళ్ళు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇకపై నయాపైసా కూడా తీసుకోవద్దని, అన్ని ఖర్చులూ నెలకు మేమే భరిస్తామని […]
విధాత: కోవిడ్ మృతుల దహన సంస్కారాలకు నయాపైసా కూడా తీసుకోవద్దని వైస్సార్ కాంగ్రెస్ రాజమండ్రి-సిటీ కో ఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ సూచించారు. సోమవారం ఆయన రాజమండ్రి కైలాసాభూమిలో మృతుల దహన సంస్కారాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైలాస భూమి వ్యాపార వ్యవస్థగా తయారవ్వడం దారుణమన్నారు.
కోవిడ్ మృతుల దహన సంస్కారాలకు వేలకువేలు వసూళ్ళు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇకపై నయాపైసా కూడా తీసుకోవద్దని, అన్ని ఖర్చులూ నెలకు మేమే భరిస్తామని హామీ ఇచ్చారు. కైలాసభూమిలో నిర్వాహకులు మానవత్వానికే మచ్చతెచ్చే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ సిబ్బంది జీతభత్యాలు కూడా పెంచిచెల్లిస్తామన్నారు. పుల్లలు ఉచితంగా ఇవ్వడానికి పేపరు మిల్లు ముందుకువచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.