పిల్లలకు మంచి ఉద్యోగాలే ఐటిపాలసీ లక్ష్యం- సీఎం జగన్
అమరావతి:మన పిల్లలకు మంచిఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశం కావాలని సీఎం జగన్ అన్నారు. ఏపీ ఐటి పాలసీపై క్యాంపు కార్యాలయంలో సీఎం అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా జగన్ ఏమన్నారంటే… హైఎండ్ స్కిల్స్ మన పిల్లలకు నేర్పించాలి.హైఎండ్ స్కిల్స్ నేర్పించే కంపెనీలకు, సంస్థలకు పాలసీలో ప్రాధాన్యత ఇవ్వండి.వారికి మంచి ప్రోత్సాహకాలను ఇవ్వండి.దీనివల్ల పిల్లల్లో అంతర్జాతీయ స్థాయిలో పనిలో అనుభవం, నైపుణ్యాలు పెరుగుతాయి.ప్రపంచ స్థాయితో పోటీపడే పరిస్థితి ఉంటుంది, మంచి ఉద్యోగాలు మన పిల్లలకు […]

అమరావతి:మన పిల్లలకు మంచిఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశం కావాలని సీఎం జగన్ అన్నారు. ఏపీ ఐటి పాలసీపై క్యాంపు కార్యాలయంలో సీఎం అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా జగన్ ఏమన్నారంటే…
హైఎండ్ స్కిల్స్ మన పిల్లలకు నేర్పించాలి.హైఎండ్ స్కిల్స్ నేర్పించే కంపెనీలకు, సంస్థలకు పాలసీలో ప్రాధాన్యత ఇవ్వండి.వారికి మంచి ప్రోత్సాహకాలను ఇవ్వండి.దీనివల్ల పిల్లల్లో అంతర్జాతీయ స్థాయిలో పనిలో అనుభవం, నైపుణ్యాలు పెరుగుతాయి.ప్రపంచ స్థాయితో పోటీపడే పరిస్థితి ఉంటుంది, మంచి ఉద్యోగాలు మన పిల్లలకు వస్తాయి.
ఐటీ కేంద్రం – విశాఖపట్నం
విశాఖపట్నం అనేది ఉద్యోగాల కల్పనకు ప్రధాన కేంద్రం అవుతుంది.ప్రభుత్వం కల్పించనున్న మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇవన్నీ కూడా నగరం స్థాయిని మరింతగా పెంచుతాయి.భవిష్యత్లో ఐటీ రంగానికి మంచి కేంద్రంగా మారుతుంది.కాలక్రమేణా ఈ అంశాలన్నీ సానుకూలంగా మారి కంపెనీలకు విశాఖ ఒక ఆకర్షణీయ కేంద్రంగా మారుతుంది.నాణ్యమైన విద్యకు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేయాలి.నాణ్యమైన విద్య వల్ల మంచి ప్రతిభావంతమైన మానవవనరులు లభిస్తాయి.హై ఎండ్ ఐటీ స్కిల్స్ యూనివర్సిటీ,ఐటీ రంగంలో అత్యుత్తమ యూనివర్శిటీని విశాఖపట్నంలో తీసుకురావాలి.ఐటీ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ లెర్నింగ్కు డెస్టినేషన్గా ఈ యూనివర్శిటీ మారాలి.
ఐటీ పాలసీ
ఏపీలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది కూడా ఇన్సెంటివ్లు చెల్లిస్తాం.కనీసం ఏడాది పాటు ఒక ఉద్యోగి స్థిరంగా అదే కంపెనీలో పనిచేయాల్సి ఉంటుంది.మొదటి ఏడాది పూర్తవగానే ఆ కంపెనీకి ఇన్సెంటివ్ల చెల్లింపులు ప్రారంభం అవుతాయి.ఈ నిబంధన వల్ల మన పిల్లలకు ఏడాదిపాటు స్థిరమైన ఉపాధి లభిస్తుంది. అంతేకాక నిర్ణీత కాలం పని వల్ల నైపుణ్యం కూడా మెరుగుపడుతుంది.
డిజిటల్ లైబ్రరీలు – వర్క్ ఫ్రం హోం
వర్క్ఫ్రం హోం కాన్పెస్ట్ను బలోపేతం చేసే చర్యలు తీసుకోవాలి.గ్రామాలకు మంచి సామర్థ్యం ఉన్న ఇంటర్నెట్ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నాం.అక్కడనుంచే పనిచేసుకునే సదుపాయం ఉంటుంది,డిసెంబర్ కల్లా సుమారు 4వేల గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చేలా అధికారులు ముందడుగు వేస్తున్నారు అదే సమయానికి డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ చర్యలతో గ్రామాలనుంచే వర్క్ఫ్రం హోం కాన్సెప్ట్ మరింత బలోపేతం అవుతుంది అన్ని గ్రామ పంచాయతీల్లో రెండేళ్లలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు పూర్తికావాలి.ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం.
ఐటీ కాన్సెప్ట్ సిటీలు
విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలలో కాన్సెప్ట్ సిటీలు,దీనికి అవసరమైన భూములను గుర్తించాలి.కాన్సెప్ట్సిటీల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంచేయాలి అధికారులకు సీఎం ఆదేశం.
ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్టరింగ్ క్లస్టర్లు(ఏఎంసీ)
కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నిర్మిస్తున్న వైయస్సార్ ఈఎంసీ ప్రగతిపై ముఖ్యమంత్రికి వివరాలు అందించిన అధికారులు.శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని వెల్లడి.
అక్టోబరులో ముఖ్యమంత్రిచే ప్రారంభోత్సవం చేయించేలా ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు.
ఈ సమావేశానికి పరిశ్రమలు,వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్(ఈఎంసీ) సీఈఓ ఎం.నందకిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Readmore:ఐటీ పాలసీపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష