మా కుటుంబం జోలికొస్తే సహించేది లేదు.. ఖబడ్దార్‌: బాలకృష్ణ

విధాత: తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ఆయన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ‘ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరం. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైంది. అభివృద్ధిపై చర్చకు బదులు వ్యక్తిగత అజెండాను తీసుకొచ్చారు. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉండే మనిషి. ఎప్పుడూ ఆయన కంటతడి పెట్టలేదు. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆనవాయితే. అయితే […]

మా కుటుంబం జోలికొస్తే సహించేది లేదు.. ఖబడ్దార్‌: బాలకృష్ణ

విధాత: తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ఆయన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ‘ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరం. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైంది. అభివృద్ధిపై చర్చకు బదులు వ్యక్తిగత అజెండాను తీసుకొచ్చారు. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉండే మనిషి. ఎప్పుడూ ఆయన కంటతడి పెట్టలేదు. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆనవాయితే. అయితే కుటుంబ సభ్యులపై దాడి సరికాదు. మేం వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎవరిని విమర్శించలేదు. మా సోదరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాగాలేదు’ అని బాలకృష్ణ అన్నారు. ‘అసెంబ్లీలో ఉన్నామో.. పశువుల కొంపలో ఉన్నామో అర్థం కావడం లేదు. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారు.. హేళన చేయవద్దు.

రాజకీయాలతో సంబంధం లేని వారిపై మాటల దాడి సరికాదు. ఏపీలో దోచుకున్న సొమ్ము ఇంట్లో దాచుకుంటున్నారు తప్ప.. అభివృద్ధి లేదు. కొత్త నీచపు సంస్కృతికి వారు తెరలేపారు.. ఆ పార్టీలోనూ బాధపడే వారున్నారు’
‘ప్రజల తరఫున.. పార్టీ తరఫున.. నా అభిమానుల తరఫున ఇదే నా హెచ్చరిక.. మళ్లీ ఇలాంటి నీచపు, నికృష్టపు మాటలు మాట్లాడితే సహించేది లేదు. ఖబడ్దార్‌.. భరతం పడతాం. ప్రతి విషయానికి హద్దు ఉండాలి’ అని బాలకృష్ణ హెచ్చరించారు.