విధాత:బందరు మండలంలో పలు తీరప్రాంత గ్రామాలలో రొయ్యల చెరువుల కౌలు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గత రెండేళ్ల నుంచి రొయ్యల ధరలు ఆశించిన స్థాయిలో ఉండగా, సాగు కూడా అనుకూలంగా ఉండటంతో రైతులు, పారిశ్రామికవేత్తలకు డాలర్ల వర్షం కురిపించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు ఇబ్బడిముబ్బడిగా ఆక్వాసాగు చేపట్టారు. మూడు దశాబ్దాల క్రితం కరగ్రహారంలో ఎకరం భూమి 20 వేలకు విక్రయించేవారు నేడు ఆ ప్రాంతంలో ఎకరం భూమి ఏడాది పాటు 50 వేల రూపాయల కౌలుకి […]
విధాత:బందరు మండలంలో పలు తీరప్రాంత గ్రామాలలో రొయ్యల చెరువుల కౌలు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గత రెండేళ్ల నుంచి రొయ్యల ధరలు ఆశించిన స్థాయిలో ఉండగా, సాగు కూడా అనుకూలంగా ఉండటంతో రైతులు, పారిశ్రామికవేత్తలకు డాలర్ల వర్షం కురిపించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు ఇబ్బడిముబ్బడిగా ఆక్వాసాగు చేపట్టారు. మూడు దశాబ్దాల క్రితం కరగ్రహారంలో ఎకరం భూమి 20 వేలకు విక్రయించేవారు నేడు ఆ ప్రాంతంలో ఎకరం భూమి ఏడాది పాటు 50 వేల రూపాయల కౌలుకి ఇస్తున్నారు. బందరు పరిసర ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఎందరో విద్యాధికులు ఆక్వా రంగంలో అడుగుపెడుతున్నారు. వీరు తమ తెలివితేటలను ఉపయోగించి ఆధునాతన సాంకేతికత ప్రక్రియలతో సాగు చేస్తున్నారు,గతంలో చెరువులపై కాపలాగా ఒక కుటుంబాన్ని జీతం ఇచ్చి నియమించుకొనేవారు. వారితో పాటు కుక్కలను గట్లపై కాపలాగా ఉంచేవారు కంచె చేను మేసినట్లు పలు సందర్భాలలో యజమాని లేని సమయంలో ముఖ్యంగా రాత్రివేళలో వలలు వేయడం పెద్ద మొత్తంలో సరుకుని మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకొనే కొంతమంది కాపలాదారుల ఉదంతం వెలుగులోనికి వస్తూనే ఉంది. అలాగే కాపలాకు ముందు బక్క చిక్కిన కుక్కలు పంట చేతికి రాకముందే నాణ్యమైన ప్రోటీన్ ఆహరం తినడంతో బలిష్ఠంగా తయారవుతున్నాయి.
Readmore:బురదతో బాలీవుడ్ బ్యూటీ
ఈ అనుభవాలను దృష్టిలో ఉంచొకొని కొందరు చెరువుల యజమానులు రాత్రివేళలో సైతం చెరువుల తీరుని పరిశీలించే నైట్ విజన్ సి సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. మరికొందరు యాప్ ల ద్వారా ఇళ్ల వద్ద నుంచే సి సి ఫుటేజ్ ని పరిశీలించి తమ తమ కాపలాదారులను నిలదీస్తున్నారు. బందరు మండలం కానూరు , పెద్దపట్నం గ్రామాలలో ప్రభుత్వ అసైన్డ్ భూములను సైతం వదలకుండా భీమవరంకు చెందిన కొంతమంది ఆక్వాసాగు చేస్తున్నప్పటికి అధికారులు మాత్రం ఈ విషయం తమకేమి తెలియదన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రొయ్యల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో బాగా ఉండటంతో రొయ్యల సాగుకు అన్నివర్గాల ప్రజలు బారులు తీరుతున్నారు. గతంలో ఆక్వాసాగు సరిగా లేని సమయంలో ఉన్న చెరువులను సైతం సాగు చేసేందుకు రైతులు, పారిశ్రామికవేత్తలు ముందుకురాని పరిస్థితి నెలకొంది. కాని ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఒక్క చెరువు కూడా బీడుగా లేదు. ప్రస్తుతం ఒక్క ఎకరం ఉన్న రొయ్యల చెరువుకు ఒక పంటకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కౌలు చెల్లించి సాగు చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.
కొంతమంది సంవత్సరంలో వర్షాకాలం, ఎండాకాలం పంటలు సాగు చేస్తుండగా మరికొంతమంది రైతులు వర్షాకాలం పంటవైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం కొన్ని కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో వేసవి కాలం పంటను కొంతమంది సాగు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. గతంలో రొయ్యల సాగు చేసి నష్టపోయిన రైతులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకు దూసుకొస్తున్నారు. ప్రధానంగా టైగర్ రొయ్య సాగు చేసిన సమయంలో చాలామంది రైతులు ఆర్థికంగా దివాలా తీశారు. ప్రస్తుతం వెనామి రొయ్యలపంట ఒక సాగు కాకపోయినా రెండవ సాగులో లాభాలు వస్తుండటంతో రైతులు రొయ్యల చెరువులను కౌలుకు తీసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. గతంలో ఎందుకూ పనికిరాని బీడు భూములను సైతం రొయ్యల చెరువులుగా చేసి కౌలుకు ఇస్తున్న పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయి. రొయ్యల సాగు చేసే మండలాల్లో ఒక్క చెరువు కూడా బీడుగా కనిపించడం లేదు. ఇదే పరిస్థితులు కొనసాగితే మాత్రం జిల్లాలోని ఆక్వా రంగం రైతులు ఆర్థికంగా పూర్తిస్థాయిలో నిలదొక్కుకునే వీలు ఉంటుంది.
ఇదిలాఉండగా రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసే హేచరీలపై ఎంపెడా అధికారులు దాడులు చేసి నాణ్యమైన రొయ్యపిల్లలను రైతులకు సరఫరా చేస్తే మాత్రం ఇంకా లాభాలొచ్చే అవకాశాలున్నాయి. జిల్లాలో రొయ్యపిల్లలు ఉత్పత్తి చేసే హేచరీలు ఉన్నప్పటికి ఆ హేచరీల్లోని కొన్నింటిలో నాణ్యమైన రొయ్యపిల్లలు తయారుకాక పంట సక్రమంగా రాక నష్టాలు పాలవుతున్నారు. కొంతమంది రైతులు అయితే పాండిచ్చేరితోపాటు ఇతర జిల్లాలకు వెళ్లి రొయ్యపిల్లలను కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. మొత్తంమీద జిల్లావ్యాప్తంగా రొయ్యల చెరువుల కౌలుకు మంచి గిరాకీ ఏర్పడింది.
Readmore:బీచ్ లో బాయ్ ఫ్రెండ్ తో జాన్వీ