విధాత:కేంద్ర హోం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సీఎం వైయస్ జగన్, యాస్ తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశామని సమావేశంలో అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే..: ఆక్సిజన్ సరఫరా:తుపాను వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి.ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి.తుపాను పరిణామాలను ఊహించి ఆ మేరకు సిద్ధం కావాలి.ఆక్సిజన్ ఉత్పత్తి […]
విధాత:కేంద్ర హోం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సీఎం వైయస్ జగన్, యాస్ తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశామని సమావేశంలో అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే..:
ఆక్సిజన్ సరఫరా:
తుపాను వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి.
ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి.
తుపాను పరిణామాలను ఊహించి ఆ మేరకు సిద్ధం కావాలి.
ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలి.
ఆక్సిజన్ సిలెండర్లకు, రీఫిల్లింగ్ చేసే ప్లాంట్లకూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి.
ఆస్పత్రులకు కరెంటు సరఫరాలో ఇబ్బందులు లేకుండా డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా విద్యుత్ సిబ్బందిని ఆయా ఆస్పత్రులకు కేటాయించాలని సీఎం ఆదేశం.
తుపాను కారణంగా ఒడిశా ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ సేకరణకు ఇబ్బందులు వస్తే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలని నిర్దేశం. ఆ మేరకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నామన్న అధికారులు
ఆక్సీజన్ తగినంత నిల్వలు పెట్టుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం
తుపాను ప్రభావిత రోజుల్లో ఆక్సిజన్ కొరత రాకుండా అధికారులు తదేక దృష్టి పెట్టాలని నిర్దేశం.
ముందు జాగ్రత్తగా వారిని తరలించాల్సిన పరిస్థితులు ఉంటే వెంటనే ఆ చర్యలు తీసుకోవాలి.
కోవిడ్ రోగులు–ప్రజలు:
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కోవిడ్ పేషెంట్ల తరలింపు అవసరం అనుకుంటే, ఇప్పుడే ఆ పని చేయాలన్న సీఎం.
కోవిడ్ కరెంటు సప్లైకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒకటికి రెండు సార్లు పూర్తిస్తాయిలో ఆలోచనలు చేసి సమర్థవంతగా చర్యలు తీసుకోవాలన్న సీఎం
అవసరమైన సాంకేతిక సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం ఆదేశం
విద్యుత్ పంపిణీ వ్యవస్థను పునఃసమీక్షించుకుని అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం
అవసరమైన చోట్ల లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశం
శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు వెంటనే ప్రారంభం కావాలన్న సీఎం
సహాయ శిబిరాల్లో నిత్యావసరాలు మొదలు, అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్న సీఎం
కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
ఈ మేరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన సీఎం శ్రీ వైయస్ జగన్.
హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ ఆదిత్యనాథ్దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు.