ఇన్సైడర్ ట్రేడింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్
విధాత:అమరావతి భూసమీకరణలో ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు.అదనపు సమాచారం దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సమయం కోరారు. విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. అమరావతి భూ సమీకరణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం తమపై కేసులు నమోదు చేయడంపై మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా పలువురు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం హైకోర్టు ప్రభుత్వ విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను […]

విధాత:అమరావతి భూసమీకరణలో ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు.అదనపు సమాచారం దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సమయం కోరారు. విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. అమరావతి భూ సమీకరణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం తమపై కేసులు నమోదు చేయడంపై మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ అనంతరం హైకోర్టు ప్రభుత్వ విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది.
హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ..మాజీ ఏజీ దమ్మాలపాటిపై.. సీఐడీ విచారణ మీద హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది.రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరడంతో విచారణ 3 వారాలకు వాయిదా వేసింది.