వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్.జగన్ ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో -2024లో ఇచ్చిన హామీలను ప్రజలు ఎందుకు నమ్మాలంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్. షర్మిల ప్రశ్నించారు
సీఎం జగన్పై షర్మిల విమర్శలు
మీ హామీలను ఎందుకు నమ్మాలంటూ ప్రశ్న
విధాత : వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్.జగన్ ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో -2024లో ఇచ్చిన హామీలను ప్రజలు ఎందుకు నమ్మాలంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్. షర్మిల ప్రశ్నించారు. ట్విటర్ వేదికగా ఆమె వైసీపీ ఎన్నికల హామీలపై విమర్శలు గుప్పించారు. 2019లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన జగన్ ఇచ్చిన కొత్త హామీలను ప్రజలు ఎందుకు నమ్మాలంటూ షర్మిల ప్రశ్నించారు. మీకు, మీ మాటకు విలువ లేదని, అలాగే మీ మ్యానిఫెస్టోకు విలువలేదన్నా జగన్పై విమర్శలు చేశారు. మ్యానిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత అని ప్రమాణం చేసిన మీరు 2019 మ్యానిఫెస్టోలో చెప్పిన ఒక్క అంశం నెరవేర్చలేదన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త మ్యానిఫెస్టో అంటే ఎవరు నమ్ముతారని షర్మిల నిలదీశారు. కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా తెస్తానని హామీ ఇచ్చిన మీరు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని, ఐదేళ్ల మీ పాలనలో రాష్ట్రానికి రాజధాని సైతం లేకుండా చేశారని విమర్శించారు.