BJP Party | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 20 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సిఉంది. మిగతా స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ 55 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది.
ఇక బీజేపీ తొలి జాబితాను పరిశీలిస్తే.. కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్కు కరీంనగర్, కోరుట్ల టికెట్లు ఇచ్చారు. విజయశాంతి మెదక్ నుంచి బరిలో దిగుతున్నారు. హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గద్వాల్ నుంచి డీకే అరుణ, తాండూరు నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేయనున్నారు.
బీజేపీ తొలి జాబితా ఇదే..
1. సిర్పూర్ – పాల్వాయి హరీశ్ రావు
2. ఖానాపూర్ – రమేశ్ రాథోడ్
3. జుక్కల్ – అరుణ తార
4. బాన్సువాడ – వెల్తుర్ల మాల్యాద్రి రెడ్డి
5. కామారెడ్డి – వెంకట్ రమణా రెడ్డి
6. కోరుట్ల – ధర్మపురి అరవింద్
7. కరీంనగర్ – బండి సంజయ్ కుమార్
8.హుజురాబాద్ – ఈటల రాజేందర్
9. మెదక్ – విజయశాంతి
10. అందోల్ – బాబు మోహన్
11. జహీరాబాద్ – రామచంద్ర
12. దుబ్బాక – రఘునందన్ రావు
13. మల్కాజ్గిరి – ఎన్ రామచంద్ర రావు
14. కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్
15. ఎల్బీనగర్ – సామ రంగారెడ్డి
16. శేరిలింగంపల్లి – గజ్జల యోగానంద్
17. తాండూరు – కొండా విశ్వేశ్వర్ రెడ్డి
18. గద్వాల్ – డీకే అరుణ
19. కల్వకుర్తి – తల్లోజు ఆచారి
20. మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి