సీనియర్ నటి మీనా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈమె పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకి ఠక్కున చంటి సినిమానే గుర్తుకు వస్తుంది. ఇందులో ముగ్గురు అన్నల ముద్దుల చెల్లెలుగా నటించి అలరించింది. ఇంకా ఎన్నో సినిమాలలో స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్లోను సత్తా చాటుతుంది మీనా.వెంకటేష్తో దృశ్యం సినిమాలో మెరిసి అలరించింది. ఇక ఈమధ్యకాలంలో టీవీ షోల్లో కూడా మెరుస్తుంది. కొద్ది రోజుల క్రితం తన భర్త మరణించడంతో డిప్రెషన్లోకి వెళ్లిన మీనా ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటకు వస్తూ కెరీర్పై ఫోకస్ పెడుతుంది. అయితే తాజాగా మీనాకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది.
నటి మీనా త్వరలోనే రాజకీయాల్లో అడుగుపెట్టనుందని ఓ ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే సినీ ప్రముఖులు చాలా మంది రాజకీయాలలో తమ సత్తా చాటుతున్నారు. . నటి రోజా, నటుడు బాలకృష్ణ, ఆలీ, కుష్బు, విజయశాంతి వంటి వారెందరో రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వగా, ఇప్పుడు వారి బాటలోనే మీనా కూడా పయనించనుందనే టాక్ వినిపిస్తుంది. ఇటీవల కేంద్రమంత్రి ఎల్. మురుగన్ ఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలకు మీనాను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు. ఈ వేడుకలో మీనాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశం అయింది. త్వరలోనే మీనా బీజేపీలో చేరనుందని ఓ టాక్ నడుస్తుంది.
బీజేపీ నిర్వహించిన కార్యక్రమానికి తమిళనాడు నుంచి వెళ్లిన వారిలో మీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.దాంతో ఆమె బీజేపీలో చేరబోతున్నారని… అందుకే మీనాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారని కొందరు ముచ్చటించుకుంటున్నారు. బిజెపిలో చేరేందుకు నటి మీనా కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఈ విషయం గురించి నటి మీనా అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన అయితే రానుంది.