గుంటూరు కారంని మిర్చిన ఘాటుగా ఉందిగా.. పూజా హెగ్డే బోల్డ్ లుక్స్కి అంతా ఫిదా

బోల్డ్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ముకుందా సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత ఈ భామకి స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం దక్కింది. అన్ని సినిమాలు మంచి హిట్స్ కావడంతో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే పరిస్థితి పూర్తిగా మారింది. అమ్మడికి అనుకున్నంతగా అవకాశాలు రావడం లేదు. పెద్దగా సక్సెస్లు అందుకోలేకపోతుంది. దీంతో ఘాటు అందాలతో కుర్రాళ్లతో పాటు నిర్మాతల దృష్టిని కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.
పూజా హెగ్డే తాజాగా రెడ్ డ్రెస్లో ఫోటో షూట్ చేసింది. గుంటూరు మిర్చిని మించి ఘాటు రేపే అందాలతో రెచ్చిపోతూ మంటలు పుట్టించింది. ఈ అమ్మడి అందాలు చూసి ప్రతి ఒక్కరు స్టన్ అవుతున్నారు. బ్యూటీ క్యూట్ లుక్స్ చూసి మైమరచిపోతున్నారు. పూజా హెగ్డే బ్యాక్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. వీపు 70ఎంఎం తెర కనిపించేలా పోజులిచ్చింది. మరోవైపు జాకెట్ లేకుండా బ్రాకి ఎక్కువ, జాకెట్కి తక్కువ లాంటి టాప్ ధరించి రెచ్చిపోయింది. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ గుంటూరు కారం ఫోటో షూట్ చేసిందా. మిర్చికి మంటలు పుట్టిస్తుందా అంటూ స్టన్నింగ్ కామెంట్స్ చేస్తున్నారు. బుట్టబొమ్మ ఘాటు అందాలకి ఫిదా కావల్సిందే అంటున్నారు.
ఇక పూజా హెగ్డే గత ఏడాది తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. వస్తున్న ఆఫర్స్ అన్నీ వెనక్కి పోతున్నాయి. ఇంతక ముందు గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఐరెన్ లెగ్గా మారింది. అందుకే నిర్మాతలు కూడా ఈ అమ్మడిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. వరుసగా ఐదు ఫ్లాప్లు పడటంతో పూజా హెగ్డే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. మహేష్ బాబుతో గుంటూరు కారం ఆఫర్ని మిస్ చేసుకుంది. దీంతోపాటు పవన్ కళ్యాణ్తో నటించాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్ని మిస్ చేసుకుంది. దీంతోపాటు విజయ్ దేవరకొండతో రెండు సినిమా ఆఫర్లు మిస్ అయ్యాయి. సాయి ధరమ్ తేజ్ సినిమాకి కమిట్ అయిందన్నారు, కాని క్లారిటీ లేదు. హిందీలో కేవలం ఒక్క సినిమా మాత్రమే చేస్తుంది. చూడాలి మరి రానున్న రోజులలో పూజా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందనేది.