ఎండలు ముదరడంతో.. వేడి గాలుల తీవ్రత కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వడదెబ్బ తగిలే అకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పిల్లలు, వృద్ధులు ఈ వేడి గాలులకు దూరంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇంట్లో నుంచి కాలు బయట మోపాలంటేనే భయపడిపోతున్నారు. ఎండలు ముదరడంతో.. వేడి గాలుల తీవ్రత కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వడదెబ్బ తగిలే అకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పిల్లలు, వృద్ధులు ఈ వేడి గాలులకు దూరంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు వెళ్లడం మంచిదని చెబుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్తే వడదెబ్బ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
వడదెబ్బ లక్షణాలు ఇవే..
ఎండలో బయట తిరిగే వారికి వడదెబ్బ తగులుతుంది. తల తిరగడం, తల నొప్పి రావడం వడదెబ్బ లక్షణాలు. ఇక తీవ్రమైన జ్వరం కూడా వస్తుంది.. అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..