Gold Rates | పసిడి, వెండి పరుగో పరుగు..! మళ్లీ భారీగా పెరిగిన ధర..!
Gold Rates | శ్రావణ మాసంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దీంతో బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. దాంతో ధరలు సైతం పెరుగుతూ వస్తున్నాయి. బడ్జెట్ తర్వాత దిగివచ్చిన ధర మళ్లీ పెరుగుతూ వస్తున్నది.

Gold Rates | శ్రావణ మాసంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దీంతో బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. దాంతో ధరలు సైతం పెరుగుతూ వస్తున్నాయి. బడ్జెట్ తర్వాత దిగివచ్చిన ధర మళ్లీ పెరుగుతూ వస్తున్నది. తాజాగా మంగళవారం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్పై రూ.950 పెరిగి తులానికి రూ.65,650కి ఎగిసింది. ఇక 24 క్యారెట్ల పసిడిపై రూ.1040 పెరగడంతో తులానికి రూ.71,620కి చేరుకుంది. మరో వైపు వెండి ధర సైతం భారీగానే పెరిగింది. ఒకే రోజు ఏకంగా కిలోకు రూ.1000 పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో పసిడి 22 క్యారెట్ల తులానికి రూ.65,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.71,620కి చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.65,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.71,770కి పెరిగింది.
ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.65,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.71,620కి ఎగిసింది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.65,650 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.71,620కి ఎగిసింది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి సైతం భారీగానే పెరిగింది. కిలోకు రూ.1000 పెరిగి ఢిల్లీలో కిలోకు రూ.83,500కి చేరింది. హైదరాబాద్లో కిలోకు రూ.88,500 పలుకుతున్నది. ఇదిలా ఉండగా.. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.