Gold Rates Hike | మగువలకు షాక్.. భారీగా పెరిగిన పసిడి, హైదరాబాద్లో వెండి కిలో రూ.3వేలపైగా జంప్..
Gold Rates Hike | మగువలకు పసిడి ధరలు భారీ షాక్ ఇచ్చాయి. ఇటీవల వరుసగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు స్వల్పంగా పెరిగ్గా.. బుధవారం మార్కెట్లో భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారానికి డిమాండ్ నేపథ్యంలో దేశీయంగా ధరలు రోజు రోజుకు పైకి కదులుతున్నాయి.

Gold Rates Hike | మగువలకు పసిడి ధరలు భారీ షాక్ ఇచ్చాయి. ఇటీవల వరుసగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు స్వల్పంగా పెరిగ్గా.. బుధవారం మార్కెట్లో భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారానికి డిమాండ్ నేపథ్యంలో దేశీయంగా ధరలు రోజు రోజుకు పైకి కదులుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.600 పెరిగి తులానికి రూ.70,600 చేరింది. 24 క్యారెట్ల గోల్డ్పై రూ.660 పెరిగి తులం ధర .77,020 ఎగిసింది. మరో వైపు వెండి ధర భారీగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో బంగారం 22 క్యారెట్ల తులానికి రూ.70,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.77,020 పలుకుతున్నది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.70,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.77,170 పలుకుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.70,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.77,020కి చేరింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.70,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.77,020కి చేరింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు మిగతా అన్ని నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి భారీగానే పెరిగింది. కిలోకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో రూ.2వేలు పెరిగి కిలో ధర రూ.95వేలకు ఎగిసింది. ఇక హైదరాబాద్లో రూ.3వేలు పెరిగి కిలోకు రూ.1,01,000కి పెరిగింది. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.