నచ్చావని చెప్పి రూ.10 లక్షలు కొట్టేసిన నైజీరియన్
విధాత: తెలుగు మాట్రిమోనియల్లో యువతిని పరిచయం చేసుకొని 10 లక్షల రూపాయలు దండుకున్న నైజీరియన్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బేగంపేటకు చెందిన ఓ యువతి తెలుగు మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ని అప్డేట్ చేసింది. ఓషర్ ఎబుక విక్టర్ అనే నైజీరియన్ తెలుగు మ్యాట్రిమోనీలో యువతి ప్రొఫైల్ చూసి తన ప్రొఫైల్ నచ్చిందని వల విసిరాడు. తాను యూఎస్లో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఆ యువతికి గిఫ్ట్ పంపించానని చెప్పి నైజీరియన్ మోసం చేశాడు. […]

విధాత: తెలుగు మాట్రిమోనియల్లో యువతిని పరిచయం చేసుకొని 10 లక్షల రూపాయలు దండుకున్న నైజీరియన్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బేగంపేటకు చెందిన ఓ యువతి తెలుగు మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ని అప్డేట్ చేసింది. ఓషర్ ఎబుక విక్టర్ అనే నైజీరియన్ తెలుగు మ్యాట్రిమోనీలో యువతి ప్రొఫైల్ చూసి తన ప్రొఫైల్ నచ్చిందని వల విసిరాడు. తాను యూఎస్లో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఆ యువతికి గిఫ్ట్ పంపించానని చెప్పి నైజీరియన్ మోసం చేశాడు. ఢిల్లీ ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారుల పేరు చెప్పి.. మీకు గిఫ్ట్ రూపంలో డాలర్స్ వచ్చాయని అది చట్టవిరుద్ధమని కస్టమ్ చార్జీలు, ఇతర చార్జీల కింద కట్టాలని ఆ యువతి నుంచి 10 లక్షల రూపాయలు దండుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి నైజీరియన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.