ఏకదంతుడిని ప్ర‌స‌న్నం చేసుకోవాలంటే.. ఈ మంత్రాలు జ‌పించాల్సిందే..!

Lord Ganesha | హిందూ సంప్ర‌దాయంలో ప్ర‌తి బుధ‌వారం వినాయ‌కుడి( Lord Vinayaka )ని పూజిస్తారు. ఇంట్లో ఏ శుభ‌కార్యం జ‌రిగినా మొద‌టి పూజ లంబోద‌రుడే అందుకుంటారు. ఎందుకంటే విఘ్నాల‌కు అధిప‌తి విఘ్నేశ్వ‌రుడు కాబ‌ట్టి. మ‌న‌స్ఫూర్తిగా గ‌ణేశుడిని పూజిస్తే అదృష్టం వ‌రిస్తుంద‌ని, ధ‌న‌లాభం సిద్ధిస్తుంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

ఏకదంతుడిని ప్ర‌స‌న్నం చేసుకోవాలంటే.. ఈ మంత్రాలు జ‌పించాల్సిందే..!

హిందూ సంప్ర‌దాయంలో ప్ర‌తి బుధ‌వారం వినాయ‌కుడి( Lord Vinayaka )ని పూజిస్తారు. ఇంట్లో ఏ శుభ‌కార్యం జ‌రిగినా మొద‌టి పూజ లంబోద‌రుడే అందుకుంటారు. ఎందుకంటే విఘ్నాల‌కు అధిప‌తి విఘ్నేశ్వ‌రుడు కాబ‌ట్టి. మ‌న‌స్ఫూర్తిగా గ‌ణేశుడిని పూజిస్తే అదృష్టం వ‌రిస్తుంద‌ని, ధ‌న‌లాభం సిద్ధిస్తుంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

శ్ర‌ద్ధ‌తో, స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సుతో వినాయ‌కుడిని ఆరాధిస్తే.. కోరిక కోరిక‌లు తీరుస్తాడ‌ని భ‌క్తులు విశ్వ‌సిస్తుంటారు. మ‌రి అలాంటి ఏకదంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి.. ఆయన ఆశీస్సులు, అనుగ్రహం పొందడానికి కొన్ని మంత్రాలు జ‌పించాల‌ని సూచిస్తున్నారు. ఈ మంత్రాల‌ను ప‌ఠించ‌డం వ‌ల్ల జీవితంలో అదృష్టం వరిస్తుంది. అంతే కాకుండా ధనలాభం చేకూరుతుంది. తలపెట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. మరి ఆ మంత్రాలు ఏంటో తెలుసుకుందాం..

“ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా”.. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. పనులు విజయమంతమవుతాయి.

ఓం గం గణపతియే నమః”.. ఈ గణేశ మంత్రం చాలా శక్తివంతమైనదని విశ్వాసం. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని ప్రతికూలతలు తొలగిపోతాయని, వ్యాపారంలో విజయం సాధిస్తారని. ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని జపిస్తే పని విజయవంతం అవుతుందని సూచిస్తున్నారు.

“ఓం ఏకదంతాయ విద్మహే, వక్రతుండా ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్”.. ఈ మంత్రాన్ని పఠించే వారు జ్ఞానం పొందుతారు. మంచి తెలివితేటలు సొంతం అవుతాయని చెబుతున్నారు.

“ఓం గ‌ణేశ ఋణం చింధి వ‌రేణ్యం హుం న‌మః ఫ‌ట్‌”    ఈ మంత్రాన్ని ప‌ఠించ‌డం వ‌ల‌న రుణ‌బాధ‌ల నుండి విముక్తి పొందుతారు

“ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వ జనమ్మే వశమానాయ స్వాహ”.. ఈ మంత్రం జపించడం వల్ల జీవితంలో శాంతి, అదృష్టం, విజయం దక్కుతాయట.

“ఓం విఘ్ననాశాయ నమః”.. జీవితంలో సుఖసంతోషాలు ఉండాలని, ఎటువంటి లోటూ లేకుండా ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ప్రయోజనం చేకూరుతుందట.

“ఓం గజకర్ణకాయ నమః”.. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తుంది. అలాగే ఒత్తిడిని అధిగమించడంలో సహాయపడుతుందట.