విధాత,సింహాచలం : జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి వారికి ఈనెల 24వ తేదీన మూడో విడత చందన సమర్పణకు ఆలయవర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. 17వ తేదీ నుంచి ఆలయ బేడామండపంలో చందనం అరగదీత ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆ మేరకు చందనం చెక్కలను అరగదీసేందుకు వీలుగా బుధవారం వాటిని ముక్కలుగా కత్తిరిస్తామని అధికారులు తెలిపారు. ఈ చందన సమర్పణ కోసం విరాళాలిచ్చేందుకు భక్తులు ముందుకు రావాలని కోరారు. ఇందుకు సంబంధించిన వివరాల కోసం 63038 00736 […]
విధాత,సింహాచలం : జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి వారికి ఈనెల 24వ తేదీన మూడో విడత చందన సమర్పణకు ఆలయవర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. 17వ తేదీ నుంచి ఆలయ బేడామండపంలో చందనం అరగదీత ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆ మేరకు చందనం చెక్కలను అరగదీసేందుకు వీలుగా బుధవారం వాటిని ముక్కలుగా కత్తిరిస్తామని అధికారులు తెలిపారు. ఈ చందన సమర్పణ కోసం విరాళాలిచ్చేందుకు భక్తులు ముందుకు రావాలని కోరారు. ఇందుకు సంబంధించిన వివరాల కోసం 63038 00736 నంబరుకు ఫోనులో సంప్రదించవచ్చని సూచించారు.