ఒంటిమిట్ట శ్రీకోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మూల వరులను దర్శించుకున్నారు.
ఒంటిమిట్ట శ్రీకోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మూల వరులను దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్, రాజంపేట ఎమ్మెల్యే, టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ చిప్పగిరి ప్రసాద్, జేఈవో శ్రీమతి సదా భార్గవి, డిప్యూటి ఈవో శ్రీ రమేష్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.