విధాత : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు బుధవారం ఉదయం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్పవృక్ష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.
స్వామివారిని కల్పవృక్ష విహారిగా దర్శించుకున్న భక్తులు పులకించారు. రాత్రి స్వామివారి సర్వభూపాల వాహనంపై ఊరేగించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, తెలంగాణ ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు.