Akhanda 2 ticket hike| అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టు షాక్

అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇంకొన్ని గంటల్లో సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ప్రీమియర్ షోకు రేట్ల పెంపుపై ప్రభుత్వ జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు, సినీ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

Akhanda 2 ticket hike| అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టు షాక్

విధాత : అఖండ 2 సినిమా(Akhanda 2) నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) షాక్ ఇచ్చింది. ఇంకొన్ని గంటల్లో సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ప్రీమియర్ షోకు రేట్ల పెంపు(ticket hike)పై ప్రభుత్వ జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు, సినీ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

తెలంగాణ ప్రభుత్వం అఖండ 2 సినిమాకు టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకుఅనుమతి ఇచ్చింది. జీఎస్టీతో కలుపుకొని సింగిల్‌ స్క్రీన్లకు టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్ల్సుల్లో టికెట్‌ ధరపై రూ.100 అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే ఈనెల 11న రాత్రి 8 గంటలకు ఒక ప్రత్యేక షోకు రూ.600 టికెట్‌ రేటుకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై సతీష్‌ కమల్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశాడు. టికెట్ల పెంపు జీవో రద్దు చేయాలన్న పిటిషనర్ తరుపున న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సినిమా టికెట్ల బుకింగ్స్ కొనసాగుతున్నాయి. ప్రీమియర్ షోలు ఈ రోజు గురువారం ప్రదర్శించబోతున్నారు. దేశం అంతటా రేపు శుక్రవారం సినిమా విడుదల కాబోతుంది.

ఇప్పటికే అఖండ 2 రిలీజ్‌ ఒకసారి వాయిదా పడింది. ఈ నెల 5న విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధినేతలకు, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు మధ్య ఫైనాన్స్ వివాదం వల్ల సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే.ఈ వివాదాన్ని సెటిల్‌ చేసుకొని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంకు సంబంధించి టికెట్ల ధరపై హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. సంయుక్త హీరోయిన్‌గా నటించగా.. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు.