సంక్రాంతి సందర్భంగా తిరుపతికి, కాకినాడకు 20 ప్రత్యేక ప్రత్యేక రైళ్లు..!
సంక్రాంతి పండుగక కోసం ఏపీలో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది

Special Trains | సంక్రాంతి పండుగక కోసం ఏపీలో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సంకాంత్రి రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కాకినాడ టౌన్, తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ఈ నెల చివరి వారం నుంచి 20 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
కాచిగూడ- కాకినాడ టౌన్ (07653) మధ్య డిసెంబర్ 28, జనవరి 4,11,18,25 రైలు నడుస్తుందని, ఆయా రోజుల్లో రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్ – కాచిగూడ (07654) మధ్య ప్రత్యేక రైలు డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో నడువనున్నాయి. కాకినాడ టౌన్లో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.50గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్కు చేరుకుంటుంది.
ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లో మల్కాజ్గిరి, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయని తెలిపింది. ఇక తిరుపతి హైదరాబాద్ – తిరుపతి (07509) ట్రైన్ డిసెంబర్ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడువనున్నది. హైదరాబాద్లో సాయంత్రం రాత్రి 7.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి – హైదరాబాద్ (07510) డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో నడుస్తుంది.
తిరుపతిలో రాత్రి రాత్రి 8.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.40 గంటలకు హైదరాబాద్కు చేరుతుంది. అయితే, తిరుపతికి నడిచే రైళ్లన్నీ నాంపల్లి నుంచి నడువనున్నాయి. ఆయా రైళ్లు సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆరుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరించారు.