Hanamkonda మృతిపై తల్లి ఫిర్యాదుతో రీపోస్టుమార్టం ప్రియుడు హత్య చేశాడని తల్లి అనుమానం జులై 12న యువతి హటాత్తుగా మృతి హనుమకొండలో సంఘటన విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తన కూతురు ఆకస్మిక మృతిపై తల్లి ఫిర్యాదు చేయడంతో హనుమకొండ పోలీసులు స్పందించి రీపోస్టుమార్టం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తన కూతురు కాజల్ ఆకస్మిక మృతి పై అనుమానం ఉందని, అబ్బాస్ హత్య చేసారని ఆరోపిస్తూ తల్లి హనుమకొండ పోలిస్ స్టేషన్లో ఆగస్టు 5న చేసిన ఫిర్యాదు మేరకు […]
Hanamkonda
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తన కూతురు ఆకస్మిక మృతిపై తల్లి ఫిర్యాదు చేయడంతో హనుమకొండ పోలీసులు స్పందించి రీపోస్టుమార్టం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తన కూతురు కాజల్ ఆకస్మిక మృతి పై అనుమానం ఉందని, అబ్బాస్ హత్య చేసారని ఆరోపిస్తూ తల్లి హనుమకొండ పోలిస్ స్టేషన్లో ఆగస్టు 5న చేసిన ఫిర్యాదు మేరకు బుధవారం రిపోస్టుమార్టం నిర్వహించారు.
ఈ కార్యక్రమం హనుమకొండ ఎమ్మార్వో, డాక్టర్లు , హనునకొండ సిఐ, పోలుసుల ఆధ్వర్యంలో పోస్ట్ రిపోస్టుమార్టం నిర్వహించారు. హనుమకొండలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమకొండ పట్టణానికి చెందిన కాజల్ అనే యువతి ఆటోడ్రైవర్గా పనిచేస్తున్న అబ్బాస్ ఆనే వ్యక్తి ప్రేమించుకున్నారు. తమ ప్రేమ వ్యవహారం ఇద్దరి ఇంట్లో తెలియడంతో ఒకరింటికి మరొక్కరు వస్తూ పోయేవారు. కొద్ది రోజుల తర్వాత పెళ్లికాకుండా ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తూ గడుపుతున్నారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏమి జరిగిందో తెలియదు కాని అబ్బాస్ కాజల్ అనారోగ్యంగా ఉందని చెప్పి గత నెల 12వ తేదీన వరంగల్ ఏంజిఎం హాస్పిటల్ తరలించాడు. అప్పటికే కాజల్ చనిపోయింది. జులై 13న హనుమకొండ ఖబరస్థాన్లో కాజల్ అంతక్రియలు నిర్వహించారు. ఈ సంఘటనపై అనుమానం వచ్చిన తల్లి ఇటీవల హనుమకొండ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన పోలీసులు రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.