అందరి ముందు ఆయనని పిలిచి మరీ సారీ చెప్పించుకున్న అనసూయ.. ఎందుకంటే..!అందాల ముద్దుగుమ్మ అనసూయ ఇప్పుడు సినిమాలతో చాలా బిజీగా ఉంటుంది. యాంకరింగ్కి గుడ్ బై చెప్పి సినిమాలలో సత్తా చాటుతుంది. తాజాగా ఆమె నటించిన చిత్రం పెదకాపు-1. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ అధినేత, ‘అఖండ’ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తన బావమరిది విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుండగా, మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్గా హైదరాబాద్లోని శిల్పకలా వేదికలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ.. చిత్రంలో తాను అక్కమ్మ అనే పాత్ర పోషించానని, ఇది తాను చేసిన గొప్ప పాత్రల్లో ఒకటని చెప్పుకొచ్చింది.
అనసూయ మాట్లాడుతున్న సమయంలో అందరు ఒక్కసారిగా అరిచారు. అప్పుడు అనసూయ.. మీరు నన్ను అభినందిస్తూ ఓ ఏసుకున్నారో, ట్రోల్ చేస్తూ ఏసుకున్నారో అర్థం కావడంలేదు అని పేర్కొంది. సినిమాలో నటించడం నా అదృష్టం. నాకు అక్కమ్మ అనే పాత్రని ఇచ్చినందుకు శ్రీకాంత్ అడ్డాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
రంగమ్మత్త పాత్రను ప్రేక్షకులు ఎంతో ఇష్టపడి తనను అలాగే పిలుచుకుంటున్నారో.. ఇప్పుడు పెదకాపు సినిమా తరవాత తనను అక్కమ్మ అని అంతే ఇష్టంతో పిలుచుకుంటారని గట్టిగా నమ్ముతున్నాను అని అనసూయ స్పష్టం చేసింది. అయితే తన స్పీచ్ మధ్యలో ఆమె ఛోటా కె నాయుడును పిలిచి.. తన గురించి ఎందుకు మాట్లాడలేదని సరదాగా అడిగింది.
అప్పుడు చోటా కే నాయుడు వెంటనే మైక్ అందుకొని ‘అనసూయ క్యారెక్టర్ సినిమాలో లేట్గా రివీల్ చేస్తారు. నేను కూడా లేట్గా చెబుదామని ఆపేశాను. అనసూయ చాలా ప్రౌడ్గా చెప్పాల్సిన క్యారెక్టర్ ఈ సినిమాలో చేసింది అని అన్నాడు. శ్రీకాంత్ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ మీద నాకు అంత నమ్మకం లేదు. కాని రెయిన్ ఎఫెక్ట్లో చేసిన తరవాత శ్రీకాంత్ వెరీగుడ్ ఛాయిస్ అని చెప్పాను అని చోటా కే నాయుడు స్పష్టం చేశారు.
అయితే అప్పుడు చోటా దగ్గరకు వెళ్లిన అనసూయ.. ‘ఛీ అడిగి మరీ చెప్పించుకున్నట్టు ఉంది’ అని అనగా. ‘సారీ అనసూయ, ఐ మీన్ ఇట్’ అంటూ హంబుల్గా క్షమాపణలు చెప్పారు ఛోటా. ‘అయ్యో సార్.. మీరు సారీ చెప్పడమేంటి’ అంటూ నవ్వుతూ అనసూయ స్పందించింది. మొత్తానికి అనసూయ ఈ ఇష్యూతో మరోసారి హాట్ టాపిక్గా మారింది.