AP విధాత: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిట్ ఫండ్ కంపెనీల మీద దాడులు కొనసాగిస్తూనే ఉంది. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో అక్రమాలను గుర్తించిన సీఐడీ విభాగం చైర్మన్ రామోజీ రావు, ఎండి శైలజను విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసు ఇప్పుడు అటు రామోజీకి, ఇటు ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం అయింది. ఇక ఇప్పుడు తాజాగా రాజమండ్రి సిటీ టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ( దివంగత ఎర్రన్నాయుడి కుమార్తె ) అత్తా గారి కుటుంబం నడిపిస్తున్న […]
AP
విధాత: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిట్ ఫండ్ కంపెనీల మీద దాడులు కొనసాగిస్తూనే ఉంది. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో అక్రమాలను గుర్తించిన సీఐడీ విభాగం చైర్మన్ రామోజీ రావు, ఎండి శైలజను విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసు ఇప్పుడు అటు రామోజీకి, ఇటు ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం అయింది.
ఇక ఇప్పుడు తాజాగా రాజమండ్రి సిటీ టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ( దివంగత ఎర్రన్నాయుడి కుమార్తె ) అత్తా గారి కుటుంబం నడిపిస్తున్న జగజ్జనని చిట్ ఫండ్స్ సంస్థ మీద దాడులు చేసిన సీఐడీ అధికారులు పలు లొసుగులు కనుగొన్నారు. ఈ క్రమంలోనే ఆమె భర్త ఆదిరెడ్డి వాసును, ఆమె మామ అప్పారావును అరెస్ట్ చేసారు.
గత నెలలో జగజ్జనని చిట్ ఫండ్ సంస్థ కార్యాలయాలు మీద దాడులు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన సీఐడీ తాజాగా మరోమారు కార్యాలయాల్లో సోదాలు చేసింది. రికార్డులు తారుమారు చేయడం. చిట్ చందాదారుల నుంచి తీసుకున్న డబ్బుకు జవాబుదారీ లేకపోవడం, ఆ డబ్బును వేరే వ్యాపారాల్లోకి మళ్లించడం వంటి అక్రమాలను గుర్తించిన సీఐడీ ఈమేరకు వారిద్దర్నీ అరెస్ట్ చేసింది.
మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలను గుర్తించే క్రమంలోనే సీఐడీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు రిజిష్టర్డ్ చిట్ ఫండ్ సంస్థల మీద దాడులు చేసింది. రికార్డులు తనిఖీలు చేసింది.. ఈ క్రమంలోనే అరెస్టులు జరుగుతున్నాయి.