Asifabad | పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం రైతుబంధు.. రైతుబీమా కూడా అమలు చేస్తాం గిరిజన ఆవాసాలకు త్రీ ఫేజ్ విద్యుత్తు సరఫరా ఆదిలాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పోడు రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా కేసులు అలాగే ఉంటే […]
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పోడు రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా కేసులు అలాగే ఉంటే పట్టాలకు అర్థం లేదని అన్నారు. అందుకే పోడు రైతులపై ఉన్న కేసులను వెంటనే ఎత్తివేయాలని సభావేదిక నుంచే ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులకు పోడు పట్టాలు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ప్రారంభించారు. పోడు పట్టాలను మహిళల పేరిట ఇస్తున్నట్టు తెలిపారు.
ఆదివాసీ, గిరిజనులపై పెట్టిన పోడు భూముల కేసులన్నీ ఎత్తివేస్తాం : సీఎం శ్రీ కేసీఆర్ pic.twitter.com/wMX4nBM4AE
— BRS Party (@BRSparty) June 30, 2023
జిల్లా పర్యటనలో భాగంగా అసిఫాబాద్లో నూతనంగా ఏర్పాటు చేసిన కొమురం భీం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడ నుండి బీఆరెస్ నూతన కార్యాలయానికి చేరుకుని, కార్యాలయాన్ని ప్రారంభించారు. బీఆరెస్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను కుర్చీలో కూర్చోబెట్టారు. తదనంతరం నూతన ఎస్పీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సమీకృత నూతన కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించి.. పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా లక్ష 51 వేల మంది పోడు రైతులకు 4 లక్షల 6వేల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో పోడు పట్టాల పంపిణీ పూర్తవుతుందని చెప్పారు. పోడు పట్టాలను మహిళల పేరున ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలలో అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. పోడు పట్టాలతో పాటు రైతు బంధు కూడా ఇస్తామని దానికి సంబంధించిన చెక్ను కలెక్టర్కు అందించామని తెలిపారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతరులు 75 సంవత్సరాలుగా ఇక్కడే పోడు వ్యవసాయం చేస్తున్నట్లుగా రికార్డులు ఉంటే వారికి కూడా పోడు పట్టాలిస్తామని తెలిపారు. దానికి కొంత సమయం పడుతుందన్నారు.
Watch Live: CM Sri KCR speaking at a public meeting in Kumuram Bheem Asifabad district. https://t.co/gECxyMketF
— BRS Party (@BRSparty) June 30, 2023
గిరిజన ప్రాంతాలకు త్రీఫేజ్ విద్యుత్తు సరఫరా
గిరిజన మారుమూల ప్రాంతాల్లో త్రీ ఫేజ్ కరెంట్ లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సీఎం.. ప్రతి మారుమూల గ్రామానికీ త్రీ ఫేజ్ కరెంటు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్రీ ఫేజ్ కరెంటు ఇవ్వడం మూలంగానే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు అందిస్తున్నామని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉన్నదని సీఎం చెప్పారు. గిరిజన సంక్షేమ నిధులతో అన్ని మారు మూల ప్రాంతాలకు త్రీఫేజ్ కరెంటు ఇస్తామని తెలిపారు. గిరి వికాసం కింద బోర్లకు కరెంటు మోటర్ అందిస్తామని తెలిపారు. ఇంత అభివృద్ధిని ఎవరూ కలగనలేదు. ఆసిఫాబాద్ జిల్లాలో ఇంతటి అభివృద్ధి జరుగుతుందని ఎవరు కలలో కూడా ఊహించలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజ్ రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకప్పుడు గిరిజన మారుమూల ప్రాంతాలలో జ్వరాలు వస్తే కొన్ని పేపర్లు మంచాన పడ్డ మన్యం అని రాసేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా బీఆరెస్ అధ్యక్షుడు కోనేరు కోనప్ప, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.