సీఎం రేవంత్ రెడ్డిపై గత మూడు రోజుల నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ నిరాదారామైన ఆరోపణలు చేస్తున్నందుకు నిరసనగా టీపీసీసీ సభ్యులు, నాయకుల హన్మకొండలో కేటీఆర్ను అరెస్ట్ చేసి అతనికి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గత మూడు రోజుల నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు నిరాదారామైన ఆరోపణలు చేస్తున్నందుకు నిరసనగా టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి ఎస్హెచ్ఓ హన్మకొండలో కేటీఆర్ను అరెస్ట్ చేసి అతనికి పై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు మాట్లాడుతూ 2500/- కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ దగ్గర, బిల్డర్స్ దగ్గర వసూలు చేసి డిల్లికి పంపించాడని లేని పోనీ అబద్దాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా మాట్లాడుతూ పరువు, బాధ్యతలకు కూడా భంగం కలిగించే విధంగా మాట్లాడుచున్నాడు. తెలంగాణా ముఖ్యమంత్రి లోక్ సభ ఎన్నికల తర్వాత భారతీయ జనతీయ పార్టీలోకి వెళ్తాడని ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించే విధముగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధముగా మాట్లాడుతన్నారని పేర్కొన్నారు.
కేటీఆర్ వద్ద ఎటువంటి ఆధారాలు లేకున్నా తప్పుడు మాటలు, నిరాధార ఆరోపణలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రిపై నిరాదారమైన మాటలు మాట్లాడి తన వ్యక్తిగత పరువు ప్రతిష్టకు భంగం కలిగించినందున కల్వకుంట్ల తారక రామారావుపై కేసు నమోదు చేసి అతనిపై చట్ట రీత్యా కటిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఇలాగే కొనసాగితే వారి పార్టీ గుర్తింపు రద్దుకు ఎలక్షన్ కమీషన్ ను కలిసి పార్టీ గుర్తింపు రద్దును చేయాలని కోరుతామని పిసిసి సభులు బత్తిని శ్రీనివాస్ రావు అన్నారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి ఈ.వి శ్రీనివాస్ రావు, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్ యాదవ్, పోతుల శ్రీమాన్, సయ్యద్ విజయశ్రీ రాజాలి, సీనియర్ నాయకులు నాయిని లక్ష్మా రెడ్డి, సయ్యద్ రాజాలి, బంక సంపత్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు తోట వెంకట రాజ్ కుమార్, లీగల్ సెల్ నాయకులూ తొగరు జగన్ మోహన్ రెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు అలువల కార్తిక్ , జిల్లా ఎన్.ఎస్. యు ఐ అద్యక్షుడు పల్లకొండ సతీష్, యాదవ్, డివిజన్ అద్యక్షులు ఎస్. కుమార్ యాదవ్, గాండ్ల స్రవంతి, మంద రాకేశ్, బంక రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.