పుస్తక ప్రదర్శన ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

పుస్తకాలు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి: మంత్రి జగదీష్ రెడ్డి మనువాదం మూలంగానే దేశం పరాయి పాలనలోకి వెళ్లిపోయింది. విధాత, నల్గొండ: భారతదేశం పురాతన కాలంలో విద్యాపరంగా ముందంజలో ఉందని, ఇక్కడ అనేక విశ్వవిద్యాలయాలు పురాతన కాలంలోనే వున్నాయని, కాని తరువాత కాలంలో మనువాదం వ్యాప్తి చెందడం వలన దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడి, విద్యా వ్యవస్థ ను సామాన్య ప్రజలకు దూరం చేశారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటూరు జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ […]

పుస్తక ప్రదర్శన ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
  • పుస్తకాలు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి: మంత్రి జగదీష్ రెడ్డి
  • మనువాదం మూలంగానే దేశం పరాయి పాలనలోకి వెళ్లిపోయింది.

విధాత, నల్గొండ: భారతదేశం పురాతన కాలంలో విద్యాపరంగా ముందంజలో ఉందని, ఇక్కడ అనేక విశ్వవిద్యాలయాలు పురాతన కాలంలోనే వున్నాయని, కాని తరువాత కాలంలో మనువాదం వ్యాప్తి చెందడం వలన దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడి, విద్యా వ్యవస్థ ను సామాన్య ప్రజలకు దూరం చేశారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటూరు జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నవ తెలంగాణ బుక్‌స్టాల్‌ను మంత్రి ప్రారంభించారు.

దేశంపై చిన్న చిన్న దేశాలు దాడులు చేయడానికి, దేశాన్ని ఆక్రమించి, ముక్కలు చేయడానికి మనువాదమే కారణమని మంత్రి అన్నారు. కాని స్వాతంత్ర్యం అనంతరం తిరిగి మతోన్మాద శక్తులు బలం పుంజుకున్నాయని, మతోన్మాద శక్తులపై పోరాటంలో ప్రగతి శీల శక్తులు వెనకబడినాయని ఆయన అన్నారు. సినిమాలు, టివిలతో ప్రభావితం అయిన యువత సమాజానికి దూరంగా వుండిపోయిందని ఆయన అన్నారు. దేశ ద్రోహ శక్తులు మళ్ళీ వర్ణ వ్యవస్థను తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అన్నారు.

ప్రజలను జాగరుకం చేయవలసిన భాధ్యత ప్రగతి శీల శక్తులపై వుందని అన్నారు. మంచి పుస్తకం ఒక మనిషి జీవితాన్ని మారుస్తుందని, ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం లో బిజెపి, ఆర్ ఎస్ ఎస్ ల పాత్ర లేదని, కాని బిజెపి నేడు తెలంగాణ సాయుధ పోరాటాన్ని మతపరమైన పోరాటంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ, చరిత్రను వక్రీకరిస్తుందని అన్నారు. బిజెపి సమాజంలో మతపరమైన విభజన తీసుకుని రావడానికి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎంపిపి నెమ్మది భిక్షం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, ఉప్పల ఆనంద్, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, సిఐటియు నాయకులు నెమ్మది వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు యాదగిరి రావు, కోట గోపి, బొమ్మిడి లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.