Ponguleti | 20 సంవత్సరాల క్రితమే దుబ్బాకలో చెరుకు ముత్యంరెడ్డి అభివృద్ధి పనులు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్రామాల్లో బెల్టు షాపులు రద్దు చేస్తాం చెక్డ్యాంలు కట్టిన ఘనత స్వర్గీయ ముత్యంరెడ్డిదే విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ,బి ఆర్ ఎస్ పార్టీ లు ఒక్కెటే నని ఖమ్మం వేదికగా తేలిపోయిందని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.రాహుల్ సభకు కు బస్ లు నిరారకరించి,అమిత్ షా సభకు రాష్ట్ర ప్రభుత్వం […]
Ponguleti |
విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ,బి ఆర్ ఎస్ పార్టీ లు ఒక్కెటే నని ఖమ్మం వేదికగా తేలిపోయిందని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.రాహుల్ సభకు కు బస్ లు నిరారకరించి,అమిత్ షా సభకు రాష్ట్ర ప్రభుత్వం వేల బస్ లను పంపిందన్నారు.టి అర్ ఎస్ సహకారంతోనే ఖమ్మం సభ జరిగిందని ఆరోపించారు. ధరణి పేరుతో బి ఆర్ ఎస్ నాయకులు భూములు కోల్ల కొట్టారని ఎంపీ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన దుబ్బాక ఆత్మగౌరవ యాత్రలో భాగంగా 100వ రోజుకు చేరుకున్న సందర్భంగా అక్బర్ పేట చౌరస్తా ఆదివారం రాత్రి రోడ్డు షోలో ముఖ్య అతిధిగా ఖమ్మం మాజీ ఎంపీ,కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఏ గ్రామంలో చూసినా స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పనులు మాత్రమే కనిపిస్తాయని పేర్కొన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మాయమాటలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి మీ ముందుకొచ్చారని పేర్కొన్నారు. తన తండ్రి ఆశయాల సాధన కోసమే తాను ప్రజల ముందుకు వస్తున్నారని తెలిపారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు రూ,500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఏక కాలంలో రైతులకు రూ,2 లక్షల రుణమాఫీ చేస్తాం అన్నారు. అలాగే ఇందిరమ్మ గృహ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి రూ,5 లక్షల రూపాయలు మంజూరు చేసి ఇల్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.
ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పదవ తరగతి పాస్ అయితే రూ,10వేల డిగ్రీ పాసైన వారికి రూ,1 లక్ష రూపాయలను ఇవ్వడం జరుగుతుందన్నారు.చెరుకు ముత్యంరెడ్డి జన్మభూమి కార్యక్రమంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు.నర్సాపూర్ సభలో ముత్యంరెడ్డికి పదవి ఇస్తానని మాట తప్పింది సిఎం కెసిఆర్ అన్నా చెరుకు ముత్యంరెడ్డి చనిపోయిన సిఎం కెసిఆర్ రాకపోవడం బాధకరమని అన్నారు.
లక్ష రుణ మాఫీలో రైతులకు మాపీ అయింది ఇరవై వేలు మాత్రమే.ఎన్నికల సమయంలో కెసిఆర్ ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్ అది కళగానే మిగిలి పోయిందన్నారు. ఇప్పుడు సిఎం కెసిఆర్ మీరు ఇళ్లు నిర్మించుకుంటే మూడు లక్షలు అంటూ చెప్పుతున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెంఢు లక్షల ఉద్యోగాలు. 4 వేల పింఛన్,ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇండ్ల స్థలాలు మరియు ఆరు లక్షలతో ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.
చెరుకు శ్రీనివాస్ రెడ్డి గెలిచిన తర్వాత దుబ్బాక నియోజకవర్గన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు. సిఎం కెసిఆర్ మరియు మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారు అని మండిపడ్డారు.మళ్లీ అధికారం కోసం బిఆర్ఎస్ పార్టీ మాయ మాటలు చెప్పి మీ ముందుకు వస్తుంది మీరే మంచి నిర్ణయం తీసుకోవాలి. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చేందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. దుబ్బాక లో 20 సంవత్సరాల క్రితమే చెక్ డ్యాములు కట్టి ఈ ప్రాంత ప్రజలకు జలకలను చూపించారని అన్నారు.