హైవే పై బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు
విధాత, హైదరాబాద్-విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 35మంది ప్రయాణికులున్నారు. అతివేగమే ప్రమాదానికి […]

విధాత, హైదరాబాద్-విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.
క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 35మంది ప్రయాణికులున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు.