విధాత, నల్గొండ: సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. బుధవారం నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ దళిత మోర్చాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు లక్ష్యంగా పనిచేయాలని కోరారు. బీజేపీలోకి ఈటెల, రాజగోపాల్ రెడ్డిలను తీసుకురావడంలో కీలకంగా ఉన్నానన్నారు. బీజేపీ గెలుపు సాధనకు ఎస్సీ, ఎస్టీ, బీసీలను కదిలించాలని సూచించారు. ప్రజల కోసం […]
విధాత, నల్గొండ: సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. బుధవారం నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ దళిత మోర్చాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు లక్ష్యంగా పనిచేయాలని కోరారు. బీజేపీలోకి ఈటెల, రాజగోపాల్ రెడ్డిలను తీసుకురావడంలో కీలకంగా ఉన్నానన్నారు.
బీజేపీ గెలుపు సాధనకు ఎస్సీ, ఎస్టీ, బీసీలను కదిలించాలని సూచించారు. ప్రజల కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.. బీజేపీ దళితులకు వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దళితుల పట్ల సీఎం కేసీఆర్ తీరు సరిగా లేదని, దళితుల స్కీములు ఇతరులకు అందుతున్నాయన్నారు. బడ్జెట్లో కేటాయింపులకు, ఓట్ల కోసం టీఆర్ఎస్ దళిత సంక్షేమం పరిమితమైందని విమర్శించారు.
పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని తామే మొదట ప్రతిపాదించామని, ఈ అంశాన్ని బండి సంజయ్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారన్నారు. కొత్తగా ఇప్పుడు టీఆర్ఎస్ అదే అంశంపై ఆందోళనల పేరుతో డ్రామాలు చేస్తుందన్నారు. టీఆర్ఎస్కు అంబేద్కర్ పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు దళితుడిని సీఎం చేయాలని, అలాగే రాష్ట్ర నూతన సచివాలయానికి, కాళేశ్వరం ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తామన్నారు.
బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వమే అంబేద్కర్కు భారత రత్న ఇచ్చిందని, మోదీ ప్రభుత్వమే అంబేద్కర్ స్ఫూర్తి కేంద్రాలను నెలకొల్పిందన్నారు. బీజేపీ దళితుడికి రాష్ట్రపతిని చేసిందని, ఇప్పుడు గిరిజన మహిళకు రాష్ట్రపతి పీఠం అధిష్టింప చేసిందని, బీసీ వర్గానికి చెందిన మోదీ ప్రధానిగా ఉన్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు బీజేపీ అధిక ప్రాధాన్యతనిస్తుందని ప్రజల కోసం పనిచేసే ఎవరైన బీజేపీలో అత్యున్నత స్థాయికి ఎదగొచ్చన్నారు. అదే కుటుంబ పార్టీల్లో అలాంటి అవకాశం రాదన్నారు.
తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ కుటుంబ, నియంతృత్వ, అవినీతి పాలనలో బందీ అయిపోయిందని, బీజేపీ ఒక్కటే రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం కబంధ హస్తాల నుంచి విముక్తి చేయగలదన్నారు. మునుగోడు ప్రజలు బీజేపీని గెలిపించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికార సాధనకు బాటలు వేసేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని కోరారు.