అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి.. ఘనంగా నివాళి విధాత, మెదక్ బ్యూరో: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా పరిషత్ కార్యాలయంలో మెదక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. మనోహర బాద్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ మాట్లాడుతూ కెసిఆర్ […]
విధాత, మెదక్ బ్యూరో: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా పరిషత్ కార్యాలయంలో మెదక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మనోహర బాద్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ మాట్లాడుతూ కెసిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కుల మతాలకు అతీతంగా ముందుకు నడిపిస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకట శైలేష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.