తెలంగాణలో కాంగ్రెస్ పాలనా పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని అమెరికాలోని సీటెల్ నగరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు
సీటెల్: తెలంగాణలో కాంగ్రెస్ పాలనా పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని అమెరికాలోని సీటెల్ నగరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర నేషనల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్, సీటెల్ ఐవోసీ అధ్యక్షుడు రాహుల్ సూర్యోదయ, సీటెల్ ఐవోసీ నాయకులు యశ్వంత్ రిషి, సాయి చరణ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డి సోదరుడు జగదీశ్వర్రెడ్డి హాజరయ్యారు. వీరితోపాటు ఐవోసీ నేషనల్ టీం సభ్యులు సందీప్ వంగల, నరేందర్ ఎల్మరెడ్డి, మాధవ నెమలి, శ్రీనివాస్ రామసహాయం, తిరుపతి పోచంపల్లి, రామ రాజు, సుధీర్ రెడ్డి, నర్స, ప్రణయ్ ముత్యాల, అజయ్ గౌడ్, బీవీ రెడ్డి, వివిధ రాష్ట్రాల నుండి పాల్గొన్నారు. ముఖ్య అతిథులు, వరంగల్ ఎమ్మెల్యే కుమార్తె నాయిని రాజేందర్ రెడ్డి కుమార్తె డాక్టర్ గోదా నాయిని పాల్గొన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి వంద రోజుల పాలన బాగుందని చెప్పారు. ఈ కార్యక్రమం అమరవీరులు, గద్దరన్నకు నివాళి అర్పిస్తూ ప్రారంభించారు. ఎన్నారైల కోసం తాను మధ్యవర్తిగా వ్యవహరించి, వారి సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తానని జగదీశ్వర్రెడ్డి హామీ ఇచ్చారు.