Congress జూలైలో కాంగ్రెస్లో చేరే అవకాశం రెండు మూడు రోజుల్లో వెల్లడించే అవకాశం విధాత: టీఆర్ఎస్ బహిష్కృత నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే మిగిలింది. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో పొంగులేటి అధికారికంగా క్లారిటీ ఇస్తారన్న చర్చ ఆయన మద్దతు దారుల్లో జరుగుతున్నది. ఈ మేరకు శుక్రవారం పొంగులేటి ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో తన మద్దతు […]
Congress
విధాత: టీఆర్ఎస్ బహిష్కృత నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే మిగిలింది. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో పొంగులేటి అధికారికంగా క్లారిటీ ఇస్తారన్న చర్చ ఆయన మద్దతు దారుల్లో జరుగుతున్నది.
ఈ మేరకు శుక్రవారం పొంగులేటి ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో తన మద్దతు దారులకు క్లారిటీ ఇచ్చారు. దీంతో పొంగులేటి మద్దతు దారులంతా ఆ సమావేశంలోనే జై కాంగ్రెస్ అని నినదించడంతో స్పష్టమైంది. అయితే తాను ఏమి నిర్ణయం తీసుకుంటానన్నది ఇంకో రెండు, మూడు రోజుల్లో స్పష్టం చేస్తానన్నారు. కాగా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలువడానికి ఈనెల 20 వ తేదీన పొంగులేటి, జూపల్లిలు ఇద్దరు ఢిల్లీ వెళతారని సమాచారం.
ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు రాహుల్, ప్రియాంకలను కలిసిన తరువాతనే ఎప్పుడు అధికారికంగా పార్టీలో చేరాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన మద్దతు దారులు చెపుతున్నారు. దాదాపుగా జూలై రెండవ వారంలో పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పొంగులేటి, జూపల్లిలను కలిసి మద్దతు తెలిపిన తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం కూడా వీరితో కలిసి పని చేసే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్నది. కోదండరాం ఇటీవల సూర్యాపేటలో నిర్వహించిన ప్లీనరీలో కేసీఆర్ను ఓడించేందుకు ఎవరితోనైనా కలిసి పని చేస్తామని ప్రకటించారు. అవసరమైతే పార్టీని విలీనం చేస్తానని వెల్లడించారు.
దీనికి ముందుగానే కోదండరాం తన పార్టీకి చెందిన పలువురు నేతలతో ఖమ్మం వెళ్లి పొంగులేటిని కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ను ఓడించేందుకు అందరం కలిసి కాంగ్రెస్లోకి వెళదామన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తన మద్దతు దారులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏ తేదీన ఢిల్లీలో చేరాలన్న దానిపై ఢిల్లీలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. వాస్తవంగా పొంగులేటి, జూపల్లిలో ఈనెల 25వ తేదీన ఖమ్మంలో జరిగే భట్టి పాదయాత్ర ముగింపుసభలో అధికారికంగా కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం జరిగింది. అయితే అధి భట్టి కోసం నిర్వహిస్తున్న సభ కావడం చేత ఆసమయంలో పార్టీలో చేరడం సరికాదన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది.
దీంతో సొంతంగానే భారీ బహిరంగ సభ నిర్వహించి అందులో కాంగ్రెస్ కండువా కప్పుకోవాలన్న నిర్ణయంతో పొంగులేటి ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు తాను నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రియాంక, రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని, ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు వచ్చినా వారి సమక్షంలో కాంగ్రెస్లో చేరాలన్న నిర్ణయంతో పొంగులేటి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జూలైలో నెల రెండవ వారంలో పార్టీలో అధికారికంగా చేరే అవకాశం ఉన్నట్లు ఆయన మద్దతు దారులు చెపుతున్నారు.