Congress | 3 నీటిపారుదల ప్రాజెక్టుల అధికారులపై సీబీఐకి ఫిర్యాదు: జడ్సన్
Congress అవినీతి అధికారుల అండతో అక్రమాలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విచారణ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ట్విట్టర్ వేదికగా వెల్లడి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో మూడు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి జరిగిన అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ మంగళవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ కుటుంబ అవినీతికి, కాంట్రాక్టర్లకు సహకరించిన అధికారులందరిపై ఫిర్యాదు చేశానన్నారు. అధికారులు, వరి కుటుంబసభ్యులు కూడా కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారని వివరించారు. […]

Congress
- అవినీతి అధికారుల అండతో అక్రమాలు
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విచారణ
- కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ట్విట్టర్ వేదికగా వెల్లడి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో మూడు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి జరిగిన అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ మంగళవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ కుటుంబ అవినీతికి, కాంట్రాక్టర్లకు సహకరించిన అధికారులందరిపై ఫిర్యాదు చేశానన్నారు.
అధికారులు, వరి కుటుంబసభ్యులు కూడా కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారని వివరించారు. తాను ఈ నెల 5వ తేదీనే సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. 20రోజుల సమయం ఇచ్చిన తర్వాత వెల్లడిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంపై సీబీఐ సీరియస్ గా పని చేస్తోందని రాష్ట్ర ప్రజల దృష్టికి ఈ విషయాన్ని తాను తీసుకువస్తున్నట్లు జడ్సన్ ట్వీట్ చేశారు.
అప్పుల పాలు చేసిన కేసీఆర్
కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను అప్పుల పాలు చేసిందన్నారు. ప్రభుత్వ పెద్దల అవినీతి వెనుక అధికారుల పాత్రకు సంబంధించి ఆధారాలతో సహా తాను సీబీఐకి ఫిర్యాదు చేశానని తానిచ్చిన అధారాలను చూసి అధికారులే విస్తుపోయారని చెప్పారు. రిటైర్మెంట్ అయిన అధికారుల అండతో ఇదంతా సాగుతోందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకోవడంలో బీజేపీ విఫలమైందని ధ్వజమెత్తారు. తన వద్ద ఇంకా 7 డిపార్ట్ మెంట్ల అవినీతికి సంబంధించిన వివరాలు ఉన్నాయని రోజుకో డిపార్ట్మెంట్ గురించి బయటకు తీసుకువస్తానన్నారు. ఈ ఆధారాలన్ని ఓ పెద్ద ఆఫీసర్ తనకు అందజేసినట్లు తెలిపారు. మిగిలిన డిపార్ట్మెంట్ల వివరాలుంటే తెలియజేయాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పాలనలో అవినీతికి పాల్పడిన అధికారులపై దర్యాప్తు జరిపిస్తామని జడ్సన్ స్పష్టం చేశారు.