అసైన్డ్‌ భూముల రికార్డుల తారుమారుకు యత్నం

సీఎం కేసీఆర్ అపద్దర్మ ప్రభుత్వం అక్రమ చర్యలను అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు

అసైన్డ్‌ భూముల రికార్డుల తారుమారుకు యత్నం
  • కేసీఆర్‌ ప్రయత్నాలను అడ్డుకోండి
  • వికాస్‌రాజ్‌కు కాంగ్రెస్‌ వినతిపత్రం


విధాత : సీఎం కేసీఆర్ ఆపద్ధర్మ ప్రభుత్వ అక్రమ చర్యలను అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించింది. ఎన్నికల్లో బీఆరెస్ ఓటమిని గ్రహించిన సీఎం కేసీఆర్‌ కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు 6వేల కోట్ల చెల్లింపులు చేసేందుకు ఆదేశాలిచ్చారని, వాటి నిలుపుదలకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.


ధరణి ద్వారా అసైన్డ్ భూములను సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన వారికి కట్టబెట్టేలా రికార్డులు తారుమారు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కోన్నారు. వెంటనే వాటిపై ఎన్నికల సంఘం స్పందించి, గత రెండు మూడు రోజులుగా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయాలు అమలు కాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని కాంగ్రెస్ బృందం కోరింది.


వికాస్‌రాజ్‌ను కలిసినవారిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేశ్‌ కుమార్ గౌడ్, హర్కర వేణుగోపాల్, నిరంజన్, రోహిణ్‌ రెడ్డి, అనిల్ యాదవ్ తదితరులు ఉన్నారు.