CPI | మాన్యువల్ రికార్డులూ ఉండాలి రైతులను బజారున పడేసిన ధరణి సర్వే నంబర్ల వారీ భూసర్వే ఎన్నడు? హుస్నాబాద్ నుంచి సీపీఐ పోటీ పొత్తులపై కేంద్ర కమిటీదే నిర్ణయం సీపీఐ రాష్ట్ర నేత చాడ వెంకట్రెడ్డి విధాత: తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా అవినీతి తగ్గిందనడంలో ఎలాంటి నిజం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి (CPI Chada Venkat Reddy) అన్నారు. ధరణి పోర్టల్కు […]
CPI |
విధాత: తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా అవినీతి తగ్గిందనడంలో ఎలాంటి నిజం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి (CPI Chada Venkat Reddy) అన్నారు. ధరణి పోర్టల్కు సమాంతరంగా మాన్యువల్ రికార్డులను సైతం నిర్వహించాల్సిందేనని చెప్పారు. ధరణిలో జరిగిన తప్పుల వల్ల చాలా మంది రైతుల బతుకులు బజారున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సర్వే నంబర్ల వారీగా చేస్తాయన్న భూ సర్వే ఏమైందని ఆయన నిలదీశారు. పోడు భూముల పట్టాల కోసం దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే.. 4 లక్షల మందికే ఇస్తామంటున్నారన్న చాడ.. మరి మిగిలినవారి పరిస్థితి ఏమిటని నిలదీశారు.
కరీంనగర్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పొత్తులపై తమ పార్టీ జాతీయ కమిటీ చర్చించి, నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణలోను ప్రజాతంత్ర, లౌకికవాద విశాల వేదిక కోసం ప్రయత్నిస్తామన్నారు. ప్రజల కోరిక మేరకు తాము పని చేస్తామని చెప్పారు.
హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి సీపీఐ పోటీ చేయాలనే ఆలోచన ఉందన్నారు. పార్లమెంట్లో కమ్యూనిస్టులు లేకపోవడం వల్ల ప్రజల గొంతు మూగబోయిందని చాలా సర్వేలు పేర్కొంటున్నాయని ఆయన వెల్లడించారు. జూన్ 4వ తేదీన కొత్తగూడెంలో ‘బీజేపీ హఠావో దేశ్ కి బచావో’ అనే నినాదంతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.