సిమ్లా కంటె చ‌ల్ల‌గా ఢిల్లీ!

దేశ రాజధానిలో ఈ సీజ‌న్‌లోనే అత్యంత చ‌లి ఉద‌యం శుక్ర‌వారం న‌మోదైంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా కంటే ఢిల్లీ శీత‌లంగా మారింది

సిమ్లా కంటె చ‌ల్ల‌గా ఢిల్లీ!
  • కనిష్ఠ ఉష్ణోగ్ర‌త 4.9 డిగ్రీల సెల్సియస్‌
  • సిమ్లాలో కనిష్ఠ‌ ఉష్ణోగ్రత 6.8 డిగ్రీలు
  • ఢిల్లీలో పెరిగిన గాలి నాణ్య‌త‌


విధాత‌: దేశ రాజధానిలో ఈ సీజ‌న్‌లోనే అత్యంత చ‌లి ఉద‌యం శుక్ర‌వారం న‌మోదైంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా కంటే ఢిల్లీ శీత‌లంగా మారింది. గాలి నాణ్య‌త కూడా పెరిగింది. ఢిల్లీలో క‌నిష్ఠ ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల కంటే తక్కువకు పడిపోయి, ఈ సీజన్‌లోనే అత్యంత చలిగా ఉద‌యంగా రికార్డ‌యింది.


భారత వాతావరణ శాఖ (IMD) న్యూఢిల్లీ-సఫ్దర్‌జంగ్ మానిటరింగ్ స్టేషన్‌లో కనిష్ఠ‌ ఉష్ణోగ్రత 4.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సిమ్లా నగరంలో కనిష్ఠ‌ ఉష్ణోగ్రత 6.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గురువారం ఢిల్లీలో గరిష్ఠ‌ ఉష్ణోగ్రత 24.1 డిగ్రీలు న‌మోదైంది. ఇది దాదాపు 24 డిగ్రీలుగా ఉండవచ్చని అంచనాలు అంచనా వేశారు. సిమ్లాలో శుక్ర‌వారం గ‌రిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీల వద్ద స్థిరపడే అవకాశం ఉన్న‌ది.


గురువారం ఢిల్లీలో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సంవత్సరం చలికాలంలో అత్యల్పంగా నమోదైంది. దేశ రాజధానిలో రెండు రోజులుగా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం కనిష్ఠ‌ ఉష్ణోగ్రత 7.4 డిగ్రీలు, మంగళవారం 6.8 డిగ్రీలు, సోమవారం 6.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.


ఢిల్లీలోని పలు మానిటరింగ్ స్టేషన్లలో శుక్ర‌వారం ఉదయం గాలి నాణ్యత ‘చాలా అనారోగ్యకరమైన’ విభాగంలో నమోదు చేయబడింది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 250 కంటే ఎక్కువగా ఉంది. ఢిల్లీ ఆనంద్ విహార్‌లో, AQI 475 గా ఉన్న‌ది.