Peddapalli | లబ్ధిదారుల వద్ద బలవంతపు వసూళ్లు పెద్దపల్లి ఎమ్మెల్యేకి దళిత బంధు సెగ విగ్రహావిష్కరణలో అడ్డుకున్న దళితులు విధాత బ్యూరో, కరీంనగర్: పెద్దపల్లి శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డికి దళిత బంధు సెగ తగిలింది. శుక్రవారం ఓదెల మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ఆయనను అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. దళిత బంధు దగా బంధుగా మారిందని, దానిని ప్యాకేజీల బంధుగా మార్చివేశారని పలువురు దళితులు ఆరోపించారు. మండలంలో అధికార […]
Peddapalli |
విధాత బ్యూరో, కరీంనగర్: పెద్దపల్లి శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డికి దళిత బంధు సెగ తగిలింది. శుక్రవారం ఓదెల మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ఆయనను అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. దళిత బంధు దగా బంధుగా మారిందని, దానిని ప్యాకేజీల బంధుగా మార్చివేశారని పలువురు దళితులు ఆరోపించారు.
మండలంలో అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర నేతలు రెండు లక్షలు ముట్టజెప్పితే దళిత బంధులో లబ్ధిదారులుగా చేర్పిస్తామని బహిరంగంగా చెబుతున్నారని వారు ఆరోపించారు. అధికార పార్టీ నేతల అవినీతి దాహం వల్ల నిరుపేదలైన దళితులకు దళిత బంధు దక్కే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మండలంలో అర్హులైన దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని లేని పక్షంలో కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించడానికి అయినా సిద్ధమేనని హెచ్చరించారు. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కుతో రానున్న ఎన్నికల్లో తగు బుద్ధి చెబుతామని, రెడ్డి అహంకారానికి తెరదించుతామని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఓదెల మండల శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మండల కేంద్రానికి చేరుకున్న దళితులు సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణకు విచ్చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని అడ్డుకున్నారు.