వారం రోజుల్లో సమస్య తీరుస్తామని కమిషనర్ హామీ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి 25వ వార్డు ధర్మన్న కాలనీకి మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయం ముందు బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీబిందెలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మహిళలు ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి.అజయ్ సారథి రెడ్డి మాట్లాడుతూ కొత్త బజార్లోని 5f జోన్ పరిధిలో నిలిచిపోయిన మిషన్ భగీరథ […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి 25వ వార్డు ధర్మన్న కాలనీకి మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయం ముందు బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీబిందెలతో ధర్నా చేశారు.
ఈ సందర్భంగా మహిళలు ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి.అజయ్ సారథి రెడ్డి మాట్లాడుతూ కొత్త బజార్లోని 5f జోన్ పరిధిలో నిలిచిపోయిన మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి అన్ని వార్డులకు వెంటనే నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతరం ప్రతినిధులు కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కbrషనర్ ప్రసన్నరాణి వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీఇచ్చారు.
కార్యక్రమంలో పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, నర్రా శ్రావణ్, వెలుగు శ్రావణ్, మంద శంకర్, తండ శ్రీనాథ్, అలీమా, బయ్య శ్రీను, బొమ్మెర సురేష్, తండ మాధవి, నక్క నాగార్జున, ఉమ, సమ్మక్క, రమ, భీమ్, కృప, యాకమ్మ తదితరులు పాల్గొన్నారు.