విధాత: గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు తక్షణమే ఇవ్వాలని కలెక్టరేట్ ముందు ధర్నా, వంటా వార్పు, రోడ్డుపైన భోజనాలు తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 1269 గ్రామపంచాయతీలో 45 వేల మంది గ్రామపంచాయతీ కార్మికులు ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ […]
విధాత: గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు తక్షణమే ఇవ్వాలని కలెక్టరేట్ ముందు ధర్నా, వంటా వార్పు, రోడ్డుపైన భోజనాలు తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా 1269 గ్రామపంచాయతీలో 45 వేల మంది గ్రామపంచాయతీ కార్మికులు ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ తరగతుల వారు అత్యధికంగా పనిచేస్తున్నారని అన్నారు. వారికి నాలుగు నుంచి ఆరు నెలల జీతాలు బకాయి ఉండడంతో కార్మికుల జీవనం కష్టంగా ఉందని ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బీబీనగర్ గ్రామపంచాయతీలో బాబు అనే మల్టీపర్పస్ వర్కర్ జీతాలు రాక పోవడంతో గ్రామపంచాయతీలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు.
ఒకవైపు జీతాలు రాకపోవడం మరోవైపు అప్పులు పెరిగి పని ఒత్తిడికి గురై వేధింపులు తట్టుకోలేక గ్రామపంచాయతీ వర్కర్లు మానసిక ఒత్తిడి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. తక్షణమే బకాయి జీతాలు విడుదల చేయడంతో పాటు సర్పంచులు.. చేసిన పనులకు బడ్జెట్ రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సిఐటియు జిల్లా సీనియర్ నాయకుడు ఢిల్లీ గోపాల్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామపంచాయతీలో సర్పంచులు సెక్రటరీల వేధింపులు, పని ఒత్తిడి వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కనీస వేతనాలు 26,000 అమలు చేయాల్సి ఉండగా మల్టీపర్పస్ వర్కర్స్ కి ఇచ్చే 8500 కూడా ఎవరి జీతం వారి అకౌంట్లో వేయకుండా ఒకరి జీతం ఇద్దరి ముగ్గురికి పంచుతున్నారని అన్నారు. గుర్తింపు కార్డులు, 10 లక్షల బీమా, ఈశ్వరం కార్డులు, హెల్త్ కార్డులు తక్షణమే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బందికి సబ్బు, నూనెలు, బట్టలు, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాటిటీ, ప్రమాద సౌకర్యాలు కల్పించాలని కార్మికులను ఇష్టానుసారం తొలగించే సర్పంచులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షుడు వి.కురుమూర్తి మాట్లాడుతూ జీవో నెంబర్ 60 ప్రకారం పారిశుద్ధ్య కార్మికుల మున్సిపల్ కార్మికుల వలె 16,500 అమలు చేయాలని వేధింపులు ఆపాలని పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నవపేట్ మండల నాయకుడు శ్రీనివాసచారి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల ఇండ్లలో పని చేయరాదని గ్రామానికి సంబంధించిన పనులు మాత్రమే సిబ్బంది చేయాలని హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఈ పోరాటానికి మద్దతుగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాస్ రామ్ నాయక్ మద్దతుగా ప్రసంగిస్తూ ఎస్సి, ఎస్టీ బీసీ తరగతుల సమస్యలు ప్రభుత్వాలు పెడచెవున పెడుతున్నాయని సమాజంలో అట్టడుగున ఉన్న గ్రామపంచాయతీ కార్మికులకు తక్షణము జీతాలు విడుదల చేసి, జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.
ధర్నాలో గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు నారాయణ మైబు నాగయ్య రవి సాగర్ వెంకటయ్య నరసింహులు ఆంజనేయులు వేణు యాదయ్య పిట్ల శ్రీనివాసులు ఆంజనేయులు గౌడ్ నాగేష్ వెంకటమ్మ వెంకటయ్య బాల నరసింహులు బాలరాజు ఆంజనేయులు సల్మాన్ బోయిన్పల్లి వెంకటయ్య బాలయ్య మన్నెమ్మ బాలకృష్ణ మాల వెంకటయ్య చిన్న ఆశన్నపాల్గొన్నారు.