ప్రస్తుతం టాలీవుడ్ లో నలుగురు సీనియర్ స్టార్ హీరోలు ఉన్నారు. వారే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్. వీరు నటించే చిత్రాలలో వీరికి సరైన జోడీగా హీరోయిన్ల ను వెతకడం కష్టతరంగా మారుతుంది. తమ వయసులో సగం వయసు కూడా లేని హీరోయిన్లతో వీరు కలిసి నటించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే మన టాప్ స్టార్ హీరోలు మాత్రం మరీ ఓవర్ చేయకుండా తమ పరిధిలో డిగ్నిఫైడ్ రొమాన్స్ ను […]
ప్రస్తుతం టాలీవుడ్ లో నలుగురు సీనియర్ స్టార్ హీరోలు ఉన్నారు. వారే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్. వీరు నటించే చిత్రాలలో వీరికి సరైన జోడీగా హీరోయిన్ల ను వెతకడం కష్టతరంగా మారుతుంది. తమ వయసులో సగం వయసు కూడా లేని హీరోయిన్లతో వీరు కలిసి నటించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే మన టాప్ స్టార్ హీరోలు మాత్రం మరీ ఓవర్ చేయకుండా తమ పరిధిలో డిగ్నిఫైడ్ రొమాన్స్ ను చేస్తూ ఓకే అనిపిస్తున్నారు.
అయితే రాబోయే కాలంలో ఇది కూడా కాస్త ఎబెట్టుగా కనిపించే అవకాశం ఉంది. దాంతో వారి చూపు ఇతర భాషలకు చెందిన ఐశ్వర్యారాయ్, త్రిష, విద్యాబాలన్, సుస్మితాసేన్ వంటి వారిపై పడనుందని అర్థమవుతుంది. ఇక తెలుగులో ఈ నలుగురు టాప్ స్టార్స్ లాగానే కోలీవుడ్ లో కూడా రజినీకాంత్, అజిత్ వంటి వారికి ఇదే సమస్య ఎదురవుతుంది. రజిని అజిత్లు బయట తెల్లని జుట్టుతోనే ఎలాంటి మేకప్ లేకుండా ఒరిజినల్ గా కనిపిస్తూ ఉంటారు. సినిమాలలో రజనీ కాస్తా స్టైలిష్ కోసం విగ్గులు, మేకప్ లు వాడుతున్న అజిత్ మాత్రం తన ఒరిజినల్ జుట్టు గడ్డాలతో కనిపిస్తున్నారు.
ఇక విషయానికి వస్తే త్వరలో అజిత్ 62 చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకుడు. ఈ చిత్రం కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతుందని సమాచారం. ఎకె62 సినిమా కోసం హీరోయిన్లుగా ఐశ్వర్యరాయ్, త్రిషాలను ఎంచుకోవాలని భావిస్తున్నారు. కథానుసారం ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. పొన్నియన్ సెల్వన్ 1 లో ఐశ్వర్య, త్రిషాలు కలిసి నటించారు కూడా.
ఈ చిత్రం సెకండ్ పార్ట్ లో కూడా వీరిద్దరూ నటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఐశ్వర్యారాయ్, త్రిష కృష్ణన్ లను తన సరసన నటించే హీరోయిన్లుగా తీసుకోవాలని అజిత్ తో పాటు దర్శకుడు విగ్నేష్ శివన్ నిర్ణయించుకున్నారని సమాచారం. వీరిని తమ జోడిగా ఎంచుకోవాలని అజిత్ తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం అని చెప్పాలి.
ఎందుకంటే ఎంత కాదనుకున్నా మరీ చిన్న వయసు ఉన్న హీరోయిన్లతో ఆడి పాడి చిందులేస్తే అది కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎంత డిగ్నిఫైడ్గా రొమాన్స్ చేసినా చూసేందుకు ఇబ్బంది ఉంటుంది. అదే దిశగా మన టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా అడుగులు వేస్తారని భావిద్దాం.