Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి. శనివారం బులియన్ మార్కెట్లో ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.100 పెరిగి తులానికి రూ.56,600కి చేరింది. 24 క్యారెట్ల పుత్తడిపై రూ.110 పెరిగి తులం రూ.61,750 పలుకుతున్నది. మరో వైపు వెండి స్వల్పం తగ్గింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.56,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,900కి చేరింది. కోల్కతాలో ముంబయిలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.56,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,750కి చేరింది.
బెంగళూరు, కోల్కతా, కేరళలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.57వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,180కి పెరిగింది. ఇక హైదరాబాద్లోని 22 క్యారెట్ల పసిడి రూ.56,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,750 పలుకున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కిలోకు రూ.700 పతనమై.. రూ.74,800కు చేరింది. హైదరాబాద్లో వెండి కిలోకు రూ.77వేలు పలుకుతున్నది.