మంత్రి సబితకు గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారు
విధాత: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రాజ్భవన్ అపాయింట్మెంట్ ఖరారైంది. సాయంత్రం 5 గంటలకు గవర్నర్ తమిళిసైతో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డుపై గవర్నర్కు ఉన్న సందేహాలను మంత్రి, అధికారులు నివృత్తి చేసే అవకాశం ఉంది. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును గవర్నర్ పెండింగ్లో పెట్టిన విషయం విదితమే. తనకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇంకా లభించలేదని మంత్రి […]

విధాత: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రాజ్భవన్ అపాయింట్మెంట్ ఖరారైంది. సాయంత్రం 5 గంటలకు గవర్నర్ తమిళిసైతో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డుపై గవర్నర్కు ఉన్న సందేహాలను మంత్రి, అధికారులు నివృత్తి చేసే అవకాశం ఉంది. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును గవర్నర్ పెండింగ్లో పెట్టిన విషయం విదితమే.
తనకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇంకా లభించలేదని మంత్రి సబిత అనడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై నిన్న ప్రెస్మీట్లో గవర్నర్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తమిళిసై కామెంట్స్తో తెలంగాణలో పొలిటికల్ కాక రేపాయి. ఈ నేపథ్యంలో తమిళిసైతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీకానుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది