ఆలయాలు ఆధ్యాత్మిక వికాస కేంద్రాలుగా మానవ జీవితంలో కీలక భూమిక పోషిస్తున్నాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖంధర్ రెడ్డి అన్నారు
విధాత: ఆలయాలు ఆధ్యాత్మిక వికాస కేంద్రాలుగా మానవ జీవితంలో కీలక భూమిక పోషిస్తున్నాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖంధర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం చాంలేడు lగ్రామంలో శ్రీ శ్రీ పంచాయత ఉమ మహేశ్వర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజ స్తంభా ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.
ఆలయాల సందర్శన మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక నైతిక మార్గాలను అందిస్తుందన్నారు. నూతన ఆలయం నిర్మాణం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ , గుర్రంపోడు ఎంపీపీపాల్వాయి వెంకటేశ్వర్లు , బీఆర్ఎస్ పార్టీ నాయకులు యామ దయాకర్, గోపాల్ రెడ్డి, హరిక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.